డ్రగ్స్ కేసులో ఇద్దరు స్టార్ నటులు
పరప్పన అగ్రహార కారాగారంలో ఉన్న సంజనకు ఆహారం, దుస్తులు అందించేందుకు ఆమె తల్లిదండ్రులు మనోహర్, రేష్మా గల్రాని గురువారం వెళ్లారు.
సంజనకు ఇంటి ఆహారం నిరాకరణ
బెంగళూరు (శివాజీనగర): పరప్పన అగ్రహార కారాగారంలో ఉన్న సంజనకు ఆహారం, దుస్తులు అందించేందుకు ఆమె తల్లిదండ్రులు మనోహర్, రేష్మా గల్రాని గురువారం వెళ్లారు. దుస్తులను మాత్రమే తీసుకున్న కారాగార సిబ్బంది, ఆహారం, పండ్ల రసం, చాక్లెట్లను వారికి వెనక్కి ఇచ్చేశారు. మరో నటి రాగిణి నాలుగు రోజులుగా కారాగారంలో ఉంటోంది. తమ బ్యారక్ల వెలుపల తిరిగేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆమె తన గది విడిచి బయటకు రావడం లేదు. సంజన వచ్చిన తరువాత ఆమెను కూడా రాగిణితో కలిపి ఉంచారు. ఇద్దరూ తమతో తెచ్చుకున్న పుస్తకాలను చదువుతూ కొంత సమయం గడిపారు. వీరిద్దరికీ కారాగారంలో సాధారణ ఖైదీలకు మాదిరి ఆహారాన్నే ఇచ్చారు. శుక్రవారం సంజనను వీడియో కాన్ఫరెన్సు ద్వారా న్యాయమూర్తి ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. కారాగార నిబంధనలకు అనుగుణంగా కుటుంబ సభ్యులు, న్యాయవాదితో మాట్లాడుకునేందుకు వీరిద్దరికీ అధికారులు అవకాశం కల్పించారు. ఇద్దరూ కొంత సమయం తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దోమలు కుడుతున్నాయంటూ సంజన కారాగారం అధికారులకు ఫిర్యాదు చేశారు. నిద్ర రావడం లేదని, ఇబ్బంది అవుతోందంటూ వాదించారు.
ప్రారంభంలో సంజన పేరు లేదు
డ్రగ్స్ కేసులో నటి సంజన గల్రాని పేరు మొదట్లో ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు. మూడు రోజుల విచారణ తరువాత ఎ14గా పేరు నమోదు చేశారు. అరెస్టుకు ముందు ఆమె నివాసంలో చేసిన సోదాల్లో ఎలాంటి మాదక ద్రవ్యాలు పోలీసులకు లభించలేదు. సంజనకు సంబంధించిన అయిదు ఫోన్లను స్వాధీనపరచుకోగా, అందులో మూడింట్లో సిమ్లు లేనట్లు గుర్తించారు. వీటితో పాటు ప్రోమాక్స్ కంప్యూటర్, డీవీఆర్ తదితరాలను స్వాధీనపరచుకున్నారు. ఈ కేసులో అరెస్టయిన ఏ4 ప్రకాశ్ రాంకా అందించిన వివరాల ఆధారంగా ఆమె విచారణను కొనసాగించాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రకాశ్ రాంకా, రాహుల్తో కలిసి ఆమె బెంగళూరు, గోవా, కేరళ, శ్రీలంకల్లోని బార్లు, పబ్లు, అపార్ట్మెంట్లలో నిర్వహించిన పలు పార్టీల్లో సంజన పాల్గొంది. ఆమె మాదక ద్రవ్యాలను విక్రయించినట్లు, వినియోగించినట్లు ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా పోలీసులకు లభించలేదు. ఆమె మూడు చరవాణులకు సంబంధించిన సిమ్ కార్డులు లభిస్తే మరో అడుగు ముందుకు వేసేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మాదక ద్రవ్యాలను విక్రయించేదని ప్రశాంత్ రాంకా ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణను కొనసాగించే అవకాశం ఉంది.
స్టార్ నటులూ ఉన్నారు: ఇప్పటికే అరెస్టయిన నిందితుల విచారణ సమయంలో చందనసీమకు చెందిన ఇద్దరు స్టార్ నటులకు దీంతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నటుల తండ్రి కూడా సినిమా రంగంలో చక్కని నటునిగా గుర్తింపు దక్కించుకున్నారు. పూర్తి ఆధారాలు చేతికి చిక్కిన తరువాతే వీరిని విచారణకు పిలిచే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
-
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!