కొత్త అనుభూతిని పంచే... ‘ఇష్క్’
ఆ రోజు ఆ అమ్మాయి పుట్టినరోజు. రాత్రి కారులో ఆ అమ్మాయి... ఓ అబ్బాయి. ఆ కారేమో బీచ్ రోడ్డులో! మరి తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ‘ఇష్క్’ చూడాల్సిందే. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయిక. యస్.యస్.రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.....
ఆ రోజు ఆ అమ్మాయి పుట్టినరోజు. రాత్రి కారులో ఆ అమ్మాయి... ఓ అబ్బాయి. ఆ కారేమో బీచ్ రోడ్డులో! మరి తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ‘ఇష్క్’ చూడాల్సిందే. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయిక. యస్.యస్.రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్.బి.చౌదరి సమర్పకులు. చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ట్రైలర్ని కథానాయకుడు సాయి తేజ్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. కథానాయకుడు తేజ సజ్జా మాట్లాడుతూ ‘‘ఇదొక కొత్త రకం కథ. ‘జాంబీరెడ్డి’ తర్వాత నేను చేసిన సినిమా ఇది. ఆద్యంతం ఉత్కంఠని రేకెత్తిస్తుంది. కొంత విరామం తర్వాత మెగా సూపర్ గుడ్ సంస్థ నాతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇదే పేరుతో నితిన్ సినిమా చేశారు. మీ సినిమా పేరు వినియోగిస్తున్నాం అనగానే నితిన్ సరే అనడంతోపాటు, ఇందులోని ‘ఆనందం...’ పాటని కూడా విడుదల చేశార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఛాయాగ్రాహకుడు సమీర్రెడ్డి వల్లే నాకు ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాని 29 రోజుల్లో ఇంత నాణ్యంగా పూర్తి చేయడానికి కారణం నిర్మాతలు, ఛాయాగ్రాహకుడు శ్యామ్ కె.నాయుడు. తేజ, ప్రియా, తమిళ నటుడు రవీందర్తోపాటు చిత్రబృందం అంతా చక్కటి సహకారం అందించింది. మహతి మంచి సంగీతం అందించార’’న్నారు. ఈ కార్యక్రమంలో వాకాడ అప్పారావు, జెమినీ కిరణ్, బెక్కం వేణుగోపాల్, మహతి స్వరసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!