Nithiin: ‘మాస్ట్రో’.. ఆఖరి ఘట్టం

బాలీవుడ్‌లో విజయవంతమైన ‘అంధాదూన్‌’ సినిమా.. తెలుగులో ‘మాస్ట్రో’గా రీమేక్‌ అవుతోంది. నితిన్‌ కథానాయకుడిగానటిస్తున్నారు.

Updated : 15 Jun 2021 10:57 IST

బాలీవుడ్‌లో విజయవంతమైన ‘అంధాదూన్‌’ సినిమా.. తెలుగులో ‘మాస్ట్రో’గా రీమేక్‌ అవుతోంది. నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నభా నటేష్‌ కథానాయిక. తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కొవిడ్‌ పరిస్థితుల వల్ల ఆగిన ఈ సినిమా.. ఇప్పుడు తిరిగి సెట్స్‌పైకి వెళ్లింది. సోమవారం నుంచి హైదరాబాద్‌లో ఆఖరి షెడ్యూల్‌ ప్రారంభించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో భాగంగా నితిన్‌, తమన్నాలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు. విభిన్నమైన క్రైమ్‌ కామెడీ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాలో నితిన్‌ అంధుడైన పియానో ప్లేయర్‌గా కనిపించనుండగా.. తమన్నా ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌, ఛాయాగ్రహణం: జె.యువరాజ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని