Sai Tej: ‘రిపబ్లిక్‌’ సందడి

సాయితేజ్‌ కథానాయకుడిగా దేవ్‌ కట్టా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. జీ స్టూడియోస్‌ పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 22 Jun 2021 07:47 IST

సాయితేజ్‌ కథానాయకుడిగా దేవ్‌ కట్టా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. జీ స్టూడియోస్‌ పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సోమవారం నుంచి సాయితేజ్‌ డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా స్టూడియోలో డబ్బింగ్‌ చెబుతున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘‘వైవిధ్యమైన పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. సాయితేజ్‌ ఐఏఎస్‌ అధికారిగా శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారు. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని