Maa Election: ఏకగ్రీవం కావాలనే కోరుకుంటున్నాం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం కావాలనే కోరుకుంటున్నట్టు తెలిపారు ‘మా’ అధ్యక్షుడు వి.కె.నరేష్. తాము పదవుల కోసం ఆశపడడం లేదని, క్రమశిక్షణ కమిటీ కోరితే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ప్రస్తుత కార్యవర్గంలో ఉన్న సభ్యులు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం కావాలనే కోరుకుంటున్నట్టు తెలిపారు ‘మా’ అధ్యక్షుడు వి.కె.నరేష్. తాము పదవుల కోసం ఆశపడడం లేదని, క్రమశిక్షణ కమిటీ కోరితే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ప్రస్తుత కార్యవర్గంలో ఉన్న సభ్యులు తమ పదవీకాలం పూర్తి కాక ముందే, ప్రకాశ్రాజ్ ప్యానల్లో చేరి మీడియా సమావేశంలో పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘మా’ ప్రస్తుత కార్యవర్గంలో ఉన్న శివ బాలాజీ, కరాటే కళ్యాణి, పసునూరి శ్రీనివాసులు, గౌతంరాజు, అశోక్కుమార్లతో కలిసి నరేష్ శనివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. తన అధ్యక్షతన ‘మా’ ఆధ్వర్యంలో చేసిన పనుల గురించి ఆయన వివరించారు. ‘‘సినీ పరిశ్రమకి ఎలాంటి సమస్య వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది. నువ్వు జీవితంలో అధ్యక్షుడివి కాలేవు అన్నారు. కానీ అధ్యక్షుడినై ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను. ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి 728 మంది సభ్యులకి రూ.3 లక్షల జీవిత బీమా చేయించాం. ఆరోగ్య బీమా, పింఛన్లు, మృతి చెందిన సభ్యుల కుటుంబాలకి సాయం, జాబ్ కమిటీలు... ఇలా ఎన్నో పనులు చేశాం. ‘మా’ రాజకీయ వ్యవస్థ కాదు. ఎంతోమంది సినీ పెద్దలు మెట్టు మెట్టు పేర్చి దీన్ని స్థాపించారు. ఇప్పటివరకు ఉన్న అధ్యక్షులంతా ‘మా’ అభివృద్ధి కోసం పనిచేశారు. నేను చేసిన ప్రతి విషయాన్నీ పెద్దలందరికీ తెలియజేశా. కానీ నాగబాబు నాలుగేళ్లుగా ‘మా’ ప్రతిష్ట మసకబారిందని వ్యాఖ్యానించారు. ఆ మాటలు తప్పు. ఆ మాటలు షాక్కి గురిచేశాయి. ప్రకాశ్రాజ్ మూడు నెలల కిందటే ఫోన్ చేసి ఈ ఏడాది ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చని చెప్పా. లోకల్, నాన్లోకల్ అనే ప్రస్తావన మేమెప్పుడూ తీసుకురాలేదు. క్రమశిక్షణ కమిటీ ఆదేశిస్తే ఇప్పటికిప్పుడు తమ కార్యవర్గం తప్పుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికి కూడా ఎన్నిక ఏకగ్రీవం కావాలనే కోరుకుంటున్నాం. గత ఎన్నికల్లో మహిళకు అవమానం జరిగింది కాబట్టి ఈసారి మహిళకి అవకాశం ఇస్తే ఏకగ్రీవం చేసేందుకు సహకరిస్తాం’’ అన్నారు నరేష్. మా కార్యవర్గ సభ్యురాలు, నటి కరాటే కళ్యాణి మాట్లాడుతూ ‘‘పదవిలో ఉండగానే మరో ప్యానల్లో చేరి నిబంధనలు ఉల్లంఘించిన సభ్యుల్ని సస్పెండ్ చేయాల’’ని కోరారు. శివబాలాజీ మాట్లాడుతూ ‘‘సేవే ప్రధాన లక్ష్యంగా పని చేశాం. ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించింది. ఎన్నికలలోపు మేం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఎవరైనా సరే వచ్చి పని చేయాలి, గుర్తింపు పొందాల’’న్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..