Maa election: ఆయన ఆవేదనలో న్యాయముంది

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో తెలంగాణ వాదం వినిపించేందుకు సిద్ధమయ్యారు నటుడు సీవీఎల్‌ నరసింహారావు.

Updated : 29 Jun 2021 05:31 IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో తెలంగాణ వాదం వినిపించేందుకు సిద్ధమయ్యారు నటుడు సీవీఎల్‌ నరసింహారావు. త్వరలో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తానని ఆయన ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘మా’లో ఇక నుంచి తెలంగాణ, ఆంధ్రా అని రెండు విభాగాలు ఉండాలని, తెలుగు వారికి న్యాయం జరిగేలా చూడాలని సీవీఎల్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడాయన వ్యాఖ్యలకు ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి మద్ధతు తెలిపారు. సీవీఎల్‌ ఆవేదనలో న్యాయముందని అన్నారు. దీనిపై ట్విటర్‌ వేదికగా స్పందించిన ఆమె.. ‘‘మా ఎన్నికలపై సీవీఎల్‌ నరసింహారావు ఆవేదన న్యాయమైంది, ధర్మమైంది. నేను ‘మా’ సభ్యురాలిని కాకపోయినా కళాకారిణిగా స్పందిస్తున్నా. చిన్న కళాకారుల సంక్షేమం దృష్ట్యా సీవీఎల్‌ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్ధిస్తున్నా’’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని