అప్పుడు చాలా భయపడ్డా
‘‘ఫలానా పాత్రలే చేయాలి అని ప్రత్యేకంగా పరిమితులేం పెట్టుకోలేదు. మంచి కథల్లో భాగమవ్వాలి.. నటిగా ప్రేక్షకుల మదిలో కలకాలం గుర్తుండిపోవాలి. అదే నా లక్ష్యం’’ అంటోంది ప్రియాంక జవాల్కర్. ‘టాక్సీవాలా’ చిత్రంతో సినీప్రియుల హృదయాల్ని కొల్లగొట్టిన తెలుగు సోయగం ఆమె. కాస్త విరామం తర్వాత ఇప్పుడు వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది.
‘‘ఫలానా పాత్రలే చేయాలి అని ప్రత్యేకంగా పరిమితులేం పెట్టుకోలేదు. మంచి కథల్లో భాగమవ్వాలి.. నటిగా ప్రేక్షకుల మదిలో కలకాలం గుర్తుండిపోవాలి. అదే నా లక్ష్యం’’ అంటోంది ప్రియాంక జవాల్కర్. ‘టాక్సీవాలా’ చిత్రంతో సినీప్రియుల హృదయాల్ని కొల్లగొట్టిన తెలుగు సోయగం ఆమె. కాస్త విరామం తర్వాత ఇప్పుడు వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ‘ఈనాడు సినిమా’ ఆమెని పలకరించగా ఆసక్తికర విషయాలు పంచుకుంది.
‘టాక్సీవాలా’ హిట్తో తెలుగు తెరపైకి దూసుకొచ్చారు. తర్వాత వేగం పెంచలేకపోయారెందుకు?
‘‘మూడేళ్లుగా తెరపై కనిపించకపోవచ్చు కానీ.. నేను ఏరోజు ఖాళీగా లేను. ఏదోక సినిమాతో సెట్స్పై బిజీగానే ఉంటున్నా. ‘టాక్సీవాలా’ విడుదలవక ముందు నుంచే చాలా ఆఫర్లు వచ్చాయి. పాతికకు పైగా స్క్రిప్ట్లు విన్నా. వాటిలో ‘గమనం’ కథ నచ్చడంతో దానికి ఓకే చెప్పా. ఆ సినిమా 2019లోనే సెట్స్పైకి వెళ్లింది. వెంటనే ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ చేశా. ఈ రెండు గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా.. కొవిడ్ పరిస్థితుల వల్ల ఆలస్యమయ్యాయి. ఈలోపు ‘తిమ్మరుసు’ చిత్రం పూర్తి చేశా. ఇవన్నీ ఈ ఏడాదిలో వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తాయి. నాకు తెలిసి ఇకపై గ్యాప్ కనిపించకపోవచ్చనే అనుకుంటున్నా’’.
మునుపటితో పోల్చితే చాలా నాజుగ్గా తయారయ్యారు. ఏదైనా పాత్ర కోసమా?
‘‘వ్యక్తిగత ఆరోగ్యాన్ని.. సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని ఇలా ప్రయత్నించా. ‘టాక్సీవాలా’ తర్వాత నేను చాలా లావై పోయా. థైరాయిడ్ సమస్యతో పాటు హార్మోన్ల అసమతౌల్యం వల్ల నేను అనారోగ్యానికి గురయ్యా అన్న సంగతి గుర్తించలేకపోయా. ఒకానొక సమయంలో ముఖమంతా మొటిమలు విపరీతంగా వచ్చేశాయి. దాంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే.. నాకున్న సమస్యలన్నీ బయటకొచ్చాయి. అప్పుడు చాలా భయపడ్డా. తర్వాత నా జీవన శైలిని పూర్తిగా మార్చుకోవాలని బలంగా నిర్ణయించుకున్నా. వ్యాయామాలు, యోగా చేయడం ప్రారంభించా. ప్రత్యేక డైట్ తీసుకోవడం మొదలు పెట్టా. ఇంట్లోనే రకరకాల కసరత్తులు చేసి మళ్లీ ఇలా ఫిట్గా మారా.
త్వరలో ‘తిమ్మరుసు’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కథేంటి? మీ పాత్ర ఎలా ఉండనుంది?
‘‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా చూశాక సత్యదేవ్తో కచ్చితంగా కలిసి పనిచేయాలనుకున్నా. అదే సమయంలో ‘తిమ్మరుసు’ కథ నా దగ్గరకొచ్చింది. సత్య చేస్తున్నాడని తెలిశాక కథ వినకుండానే ఓకే చెప్పేశా. చిత్రీకరణకు ముందు పూర్తి స్క్రిప్ట్ విన్నాక.. నా ఎంపిక సరైనదే అనిపించింది. ఇదొక పరిశోధనాత్మక థ్రిల్లర్. నేను.. సత్య.. లాయర్లుగా కనిపిస్తాం. మేమిద్దరం కలిసి ఓ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంటాం. ఆ కేసేంటి? దాన్ని ఛేదించే క్రమంలో మాకెదురైన ఇబ్బందులేంటి? ఆ కేసు మేం గెలిచామా.. లేదా? అన్నది చిత్ర కథాంశం. నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’.
‘గమనం’, ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ విశేషాలేంటి?
‘‘గమనం’ నాకు చాలా స్పెషల్ సినిమా. వాస్తవికతకు చాలా దగ్గరగా ఉండే కథతో తెరకెక్కుతోంది. అందులో నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముస్లిం యువతిగా కనిపిస్తా. చాలా ఎమోషనల్గా ఉంటుంది. సుజనా రావు ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకుల గుండెలు భావోద్వేగంతో బరువెక్కుతాయి. ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’లో ఓ గడుసుదనం నిండిన కాలేజీ అమ్మాయిలా కనిపిస్తా. ఈ పాత్ర కోసం నా కాస్ట్యూమ్స్ నేనే ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్నా’’.
ప్రస్తుతం టాలీవుడ్లో తెలుగమ్మాయిలకు ఎలాంటి ఆదరణ కనిపిస్తోంది?
‘‘మంచి ఆదరణే కనిపిస్తోంది. ఈమధ్య ఇండస్ట్రీలో తెలుగు కథానాయికల సందడి బాగానే కనిపిస్తోంది. మంచి అవకాశాలే దక్కుతున్నాయి. చాలా మంది ‘తెలుగమ్మాయి కావడం వల్ల ఏమన్నా అవకాశాలు కోల్పోయారా’ అని అడుగుతుంటారు. నిజానికి నాకిప్పటి వరకు అలాంటి అనుభవమే ఎదురుకాలేదు. ఆ ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. కథలు.. పారితోషికాల విషయాల్లో కొన్ని సినిమాలు చేజారి ఉండొచ్చు.. అంతే కానీ, మరే ఇబ్బందులు లేవు. ఓ తమిళ చిత్రానికీ సంతకాలు చేశా. కరోనా పరిస్థితుల వల్ల కాస్త ఆలస్యమవుతోంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?