బ్యాంక్ల్లోనూ థియేటర్లు కడతారు
‘‘రానున్న పదేళ్ల కాలంలో సినీ ప్రదర్శన రంగంలో పెను మార్పులు జరుగుతాయి’’ అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేష్బాబు. ఇప్పుడున్న విధానం మారిపోయి అపార్ట్మెంట్లలోనూ... బ్యాంక్ల్లోనూ యాభై సీట్లతో కూడిన థియేటర్లు ఏర్పాటయ్యే
‘‘రానున్న పదేళ్ల కాలంలో సినీ ప్రదర్శన రంగంలో పెను మార్పులు జరుగుతాయి’’ అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేష్బాబు. ఇప్పుడున్న విధానం మారిపోయి అపార్ట్మెంట్లలోనూ... బ్యాంక్ల్లోనూ యాభై సీట్లతో కూడిన థియేటర్లు ఏర్పాటయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇటీవల ఆయన కలైపులి ఎస్.థానుతో కలిసి ‘నారప్ప’ చిత్రాన్ని నిర్మించారు. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సురేష్బాబు ఆదివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘మా ‘నారప్ప’ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడం వల్ల వెంకటేష్కి, దర్శకుడికీ, అభిమానులకే కాదు నాకూ బాధగా ఉంది. కొన్ని విషయాల్లో వాస్తవిక ధోరణిలో ఆలోచించక తప్పదు. ‘నారప్ప’ సినిమాకి నేను మాత్రమే నిర్మాత అయ్యుంటే కచ్చితంగా ఓటీటీలో విడుదల చేసేవాణ్ని కాదు. ఓటీటీలో విడుదల చేయడంతో నాకు డబ్బు మిగిలినా నేను ఆ డబ్బుని వేరే వ్యాపారంలో పెట్టను కదా. ఆ డబ్బుతో మామూలుగా ఉన్న థియేటర్లని మరిన్ని హంగులతో బాగు చేయించుకుంటా. లేదా ఇంకో సినిమా చేస్తాను. ఎటొచ్చీ పరిశ్రమలోనే మేం డబ్బు పెడతాం’’.
* ‘‘మనకు రకరకాల మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఒకటి ఓటీటీ. మనం ఓటీటీని అడ్డుకోగలమని నేను అనుకోవడం లేదు. కొవిడ్ రాకపోయుంటే మాత్రం ఇంత వేగంగా మనం అలవాటయ్యేవాళ్లం కాదు. ఓటీటీ వేదికల వల్ల సినిమా రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రదర్శన రంగం మాత్రం ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం స్పందించి సహకారం అందించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఓటీటీ కొనసాగుతూనే.. పెద్ద పెద్ద నగరాల్లో సూపర్స్క్రీన్స్ రాబోతున్నాయి. క్లబ్హౌస్ల తరహాలో పలు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ల్లో మూడు నాలుగేళ్ల తర్వాత మినీ థియేటర్లు కట్టేస్తారు. ఈకామర్స్ వల్ల మనం బ్యాంక్కి వెళ్లాల్సిన పనే లేదిప్పుడు. కానీ బ్యాంక్లు వారి ప్రాజెక్టుల్ని వ్యక్తిగతంగా వివరిస్తూ ఖాతాదారులకి అమ్మాల్సి ఉంటుంది. అలా వాళ్లని బ్యాంక్లకి ఆకర్షించడం కోసం అక్కడ థియేటర్లని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా వినోద రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయి’’.
* ‘‘థియేటర్ల పరంగా ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణలోనూ సమస్యలున్నా త్వరలోనే థియేటర్లని తెరిచేస్తారు. ఆంధ్రప్రదేశ్లో రూ.20, రూ.30 టికెట్ ధర పెట్టి ఏసీ థియేటర్ నడపడం అంటే చాలా కష్టం. దీనికితోడు కరోనా వల్ల యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో ప్రదర్శనలు కొనసాగించాల్సి రావడం, రాత్రివేళల్లో లాక్డౌన్ కొనసాగుతుండడం వంటి కారణాల వల్ల అక్కడ థియేటర్లని తెరవడం కష్టం అవుతోంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో