Aamir Khan: కాకినాడ వచ్చిన ఆమిర్‌ఖాన్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ తూర్పు గోదావరి జిల్లాకు వచ్చారు.

Updated : 13 Aug 2021 10:08 IST

కాకినాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ తూర్పు గోదావరి జిల్లాకు వచ్చారు. లాల్‌సింగ్‌ చద్దా సినిమా షూటింగ్‌ నిమిత్తం రెండ్రోజులపాటు జిల్లాలో ఆయనపై పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. శుక్రవారం అమలాపురంలో, శనివారం కాకినాడ బీచ్‌లో చిత్రీకరణ జరగనుంది. అమీర్‌ఖాన్‌ కాకినాడలోని ఓ హోటల్‌లో బస చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆయన్ని కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. ఆయన బస చేసిన హోటల్‌కు ప్రైవేట్‌ సెక్యూరిటీ ఆధ్వర్యంలో రక్షణ కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని