Chiranjeevi: మాది గురుశిష్యుల అనుబంధం
తనకు అల్లురామలింగయ్యతో గురుశిష్యుల అనుబంధం ఉండేదని, సినిమాల్లో హాస్యం పండించిన ఆయన నిజ జీవితంలో మార్గదర్శకునిగా నిలిచారని మాజీ ఎంపీ, అగ్ర కథా నాయకుడు చిరంజీవి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అల్లు రామలింగయ్య హోమియో కళాశాలలో శుక్రవారం అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ, నూతన భవన నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు.
సినీ నటుడు చిరంజీవి
తనకు అల్లురామలింగయ్యతో గురుశిష్యుల అనుబంధం ఉండేదని, సినిమాల్లో హాస్యం పండించిన ఆయన నిజ జీవితంలో మార్గదర్శకునిగా నిలిచారని మాజీ ఎంపీ, అగ్ర కథా నాయకుడు చిరంజీవి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అల్లు రామలింగయ్య హోమియో కళాశాలలో శుక్రవారం అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ, నూతన భవన నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అల్లు శతజయంతి ఉత్సవ వేదికపై చిరంజీవి మాట్లాడారు. ‘‘నటుడిగా జన్మించింది ఈ గడ్డమీదే. ముఖానికి మేకప్ వేసుకొన్నది ఇక్కడే. నా మొదటి మూడు చిత్రాలు రాజమహేంద్రవరంలోనే షూటింగ్ జరుపుకోవడం విశేషం. ఇక్కడే అల్లు రామలింగయ్యతో పరిచయం ఏర్పడిందన్నారు. మన ఊరి పాండవులు సినిమా షూటింగ్ తర్వాత రైలులో తిరిగి వెళుతూ రావుగోపాల రావుతోపాటు కొందరితో రైలులో సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడే నా గుణగుణాలపై టిక్ మార్కు పడింది. దాంతో సురేఖ ద్వారా బంధుత్వం ఏర్పడింది. సినీరంగంలో స్థిరపడి హోమియోపై ఆసక్తితో పరీక్షలు రాసి ఆర్ఎంపీ ఇన్ హోమియోపతిగా రామలింగయ్య ధ్రువీకరణ పత్రం పొందారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సత్యనారాయణ తదితర నటులకు ఆయనే మందులు ఇచ్చేవారు. తాను రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించే సమయంలో ఎంపీ నిధుల నుంచి రూ.2 కోట్లు ఈ హోమియో భవన నిర్మాణానికి కేటాయించాను. అంతకంటే ముందు కళాశాల నిర్మాణ సమయంలో సొంత డబ్బులు ఇచ్చాను’’ అని చిరంజీవి తెలిపారు.
పరిశ్రమకు పెద్దదిక్కు
మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ మాట్లాడుతూ అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు సినీ రంగానికి పండగ లాంటిదన్నారు. చిరంజీవి సినిమా పరిశ్రమకు పెద్దాయనగా ఉన్నారన్నారు. దాసరి నారాయణరావు, డీవీఎస్ రాజు వంటి వాళ్లు చనిపోయిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో పరిశ్రమకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, నిలబడి నేనున్నానని ముందుకు వస్తున్నాడన్నారు. కరోనా సమయంలో పేద కళాకారులకు ఆర్థిక సహాయంతోపాటు సినీ రంగంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలను ఆయనే సరిచేస్తున్నారన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ మా కుటుంబం హోమియో వైద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలబడతామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు.
- న్యూస్టుడే, రాజమహేంద్రవరం
ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్లో జరిగాయి. కోకాపేట్లోని అల్లు స్టూడియోస్లో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహాన్ని కథానాయకుడు అల్లు అర్జున్ తన సోదరులు అల్లు బాబీ, అల్లు శిరీష్తో కలిసి ఆవిష్కరించారు. ఈ యేడాది అల్లు రామలింగయ్య వందో జయంతి వేడుకల్ని రెండు చోట్ల జరపాలని నిర్ణయించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్