Samantha-naga chaitanya: ఔను... విడిపోతున్నాం
కొన్నాళ్లుగా సాగుతున్న ప్రచారాన్నే నిజం చేసింది నాగచైతన్య, సమంత జోడీ. వాళ్లిద్దరి వైవాహిక బంధానికి తెరపడింది. తాము భార్యాభర్తలుగా విడిపోతున్నామని శనివారం సంయుక్తంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.
నాగచైతన్య, సమంత సంయుక్త ప్రకటన
కొన్నాళ్లుగా సాగుతున్న ప్రచారాన్నే నిజం చేసింది నాగచైతన్య, సమంత జోడీ. వాళ్లిద్దరి వైవాహిక బంధానికి తెరపడింది. తాము భార్యాభర్తలుగా విడిపోతున్నామని శనివారం సంయుక్తంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఎన్నో చర్చలు, ఆలోచనల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘‘ఇక నుంచి మా సొంత మార్గాల్లో ప్రయాణం చేయడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా మధ్య ఒక దశాబ్దానికిపైగా స్నేహం ఉండటం మా అదృష్టం. ఇది మా మధ్య ప్రత్యేకమైన బంధాన్ని నిలిపి ఉంచుతుందని నమ్మకం. ఈ క్లిష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతు కావాలి. ముందడుగు వేయడానికి మాకు అవసరమైన గోప్యతని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అంటూ ఇద్దరూ ఒకే రకంగా ట్వీట్ చేశారు. నాగచైతన్య, సమంత వెండితెరపై విజయవంతమైన జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఏమాయ చేసావె’లో కార్తీక్, జెస్సీగా సందడి చేసి ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్నారు. ఆ సినిమా నుంచే ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. ‘మనం’ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. చాలా కాలంపాటు సన్నిహితంగా కొనసాగిన ఈ జోడీ అక్టోబరు 6, 2017న గోవాలో వివాహ బంధంతో ఒక్కటైంది. వరుసగా రెండు రోజులు హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత ఇద్దరూ సినీ జీవితాన్ని కొనసాగించారు. పెళ్లికి ముందు ‘ఏమాయ చేసావె’తోపాటు ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ తదితర చిత్రాల్లో నటించిన ఈ జంట, పెళ్లితర్వాత ‘మజిలీ’లో భార్యాభర్తలుగా నిజ జీవిత పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించింది. పెళ్లి తర్వాత నాలుగేళ్లకే ఈ ఇద్దరూ వివాహ బంధం నుంచి వైదొలిగారు. ఇటీవలే ఇద్దరూ విడిపోతున్నారనే ప్రచారం చిత్ర పరిశ్రమలో ఊపందుకుంది. ఈ ప్రచారంపై ఇద్దరూ గోప్యత పాటిస్తూ వచ్చారు. పెళ్లిరోజుకి నాలుగు రోజుల ముందే విడిపోతున్నట్టు ప్రకటించారు. దీనివెనక కారణాల్ని మాత్రం వెల్లడించలేదు. కొన్ని నెలల కిందటే ఈ విషయంపై ఇద్దరూ ఓ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. సమంత తన ట్విటర్ ఖాతాలో అక్కినేని ఇంటి పేరుని తొలగించినప్పట్నుంచి వీరి వైవాహిక బంధం మరింతగా చర్చకువచ్చింది. ఇటీవలే నాగచైతన్య ‘లవ్స్టోరి’లో నటించారు. సమంత ‘శాకుంతలం’ చిత్రీకరణని పూర్తి చేసింది.
దురదృష్టకరం: నాగార్జున
‘సమంత, చైతన్య మధ్య జరిగింది దురదృష్టకరం’ అన్నారు నాగార్జున. ఆయన ట్విటర్ ద్వారా స్పందిస్తూ... ‘‘బరువెక్కిన హృదయంతో చెబుతున్న మాట ఇది. భార్య, భర్త మధ్య జరిగే విషయాలు చాలా వ్యక్తిగతమైనవి. సమంత, చైతన్య ఇద్దరూ నాకు ఎంతో ప్రియమైనవారు. నా కుటుంబం సమంతతో గడిపిన క్షణాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయి. ఆమె మాకు ఎప్పుడూ ప్రియమైన వ్యక్తే. దేవుడు వారిద్దరినీ శక్తితో దీవించుగాక’’ అంటూ వ్యాఖ్య చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..