Sai Dharam Tej: కోలుకున్న సాయితేజ్‌

రోడ్డు ప్రమాదంలో గాయపడి... చికిత్స పొందుతున్న యువ కథానాయకుడు సాయి తేజ్‌ కోలుకున్నారు. ప్రమాదం తర్వాత తొలిసారి ఆయన ట్వీట్‌ చేశారు.

Updated : 04 Oct 2021 04:34 IST

రోడ్డు ప్రమాదంలో గాయపడి... చికిత్స పొందుతున్న యువ కథానాయకుడు సాయి తేజ్‌ కోలుకున్నారు. ప్రమాదం తర్వాత తొలిసారి ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘నాపైన... నా సినిమా  ‘రిపబ్లిక్‌’పైన మీరు చూపిన ప్రేమ, ఆప్యాయత పట్ల నా కృతజ్ఞతను తెలియజేయడానికి థ్యాంక్స్‌ ఓ చిన్న పదం అవుతుంది’’ అంటూ తన బొటనవేలితో కూడిన ఫొటోని ట్వీట్‌ చేశారు సాయి తేజ్‌. అది చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు స్పందించారు. త్వరగా కోలుకుని తిరిగి రావాలంటూ బదులిచ్చారు. సాయి తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘రిపబ్లిక్‌’ ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని