MAA Elections: మేమే ఎందుకు టార్గెట్?
‘‘అందరూ జీవిత, రాజశేఖర్లనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు’’ అన్నారు నటి జీవిత. ప్రపంచంలో ఎవరూ చేయని పనులు.. తప్పులు తామేం చేశామని అడిగారు. మంచి చేయాలనుకోవడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నించారు. అక్టోబరు 10న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్
‘‘అందరూ జీవిత, రాజశేఖర్లనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు’’ అన్నారు నటి జీవిత. ప్రపంచంలో ఎవరూ చేయని పనులు.. తప్పులు తామేం చేశామని అడిగారు. మంచి చేయాలనుకోవడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నించారు. అక్టోబరు 10న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న ఆమె తమపై వస్తున్న విమర్శలపై సోమవారం హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడారు. గతంలో నరేశ్ గారే తమని ‘మా’ ఎన్నికల్లోకి ఆహ్వానించారని, ఆయన మాటలు వినే ఎన్నికల్లో పోటీ చేశామని అన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో నేను ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేస్తానని మోహన్బాబు, నరేశ్, విష్ణులకు ముందే చెప్పా. అయినా ఎవరు ఏ ప్యానల్లో ఉంటారన్నది వాళ్ల వాళ్ల ఇష్టాల్ని బట్టి ఉంటుంది. గతంలో మేము నరేశ్కు మద్దతుగా నిలిచాం. ఆయన ఎవరిని తిడితే వాళ్లను తిట్టాం. అయితే ఆ ఆరోపణలు ఎన్నికల వరకే పరిమితం చేయాలని రాజశేఖర్.. నరేశ్కు సూచించారు. దానికి ఆయన కూడా సరే అన్నారు. కానీ, తర్వాత ఆ విషయంలోనే మాకు.. నరేశ్కు విభేదాలు తలెత్తాయి. ఇక ‘మా’ డైరీ విడుదల కార్యక్రమం తర్వాత మా మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ‘మా’ కోసం నరేశ్ పనులు చేయలేదని నేను ఎక్కడా చెప్పలేదు. ఆయన అందరినీ కలుపుకొని పోకపోవడం వల్లే ఇన్ని సమస్యలొచ్చాయి. ఏ నిర్ణయం తీసుకుందామన్నా ఎవరినీ పిలిచే వారు కాదు. ‘వాళ్లంతా ఎందుకు? మనం సరిపోతాం కదా’ అనేవారు. తర్వాత ఆయన ఓ ఫారెన్ ప్రొగ్రాం నిర్ణయించారు. ఇదే కార్యక్రమం విషయంలో ఆయన రచ్చ రచ్చ చేశారు. చిరంజీవితో సహా పెద్దలందరూ కలిసి ఓ కమిటీ ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమానికి సంబంధించిన లావాదేవీలను లెక్కించారు. చివరకు ఎలాంటి తప్పు జరగలేదని నిర్ధారించారు. అయినా కూడా అదే అంశంపై నరేశ్ ఎలక్షన్స్లో మాట్లాడారు. ఆ పాయింట్తోనే ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత ఎవరైతే ఆ ఫారెన్ ప్రొగాం చేశారో అదే వ్యక్తులతో మళ్లీ కాంట్రాక్ట్ కుదుర్చుకుని, వాళ్ల దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు. వాళ్లలో ఓ వ్యక్తి అమెరికాలో ప్రోగ్రాం చేసినందుకు రూ,కోటి ఇస్తామన్నారు. ఇదే విషయాన్ని నరేశ్ మాతో చర్చించారు. ‘ఎవరి వల్ల అయితే సమస్య వచ్చిందో వాళ్లతోనే మళ్లీ ప్రోగ్రాం చేస్తామనడం సమంజసం కాద’ని 14 మంది ‘మా’ ప్యానెల్లోని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ మీటింగ్ పెట్టాకే నిర్ణయం తీసుకుందామని నరేశ్కు చెబితే అందుకు ఆయన ఒప్పుకోలేదు. అక్కడే మాకూ ఆయనకు సమస్య వచ్చింది. అప్పటి నుంచి మేం ఏం మాట్లాడినా ఆయన తప్పుగా భావించేవారు. జనరల్ బాడీ మీటింగ్ పెడదామంటే మాకు నోటీసులు పంపారు. సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని డైరీ విడుదల వేడుక సింపుల్గా చేద్దామని మేము సూచించాం. కాదని, దాన్ని ఓ పెద్ద వేడుకలా చేసింది నరేశ్. అప్పుడే రాజశేఖర్ మాట్లాడారు. అది తప్పెలా అవుతుంది. ఇన్ని తప్పులు పెట్టుకుని భాయీ.. భాయీ అంటూ ఎలా కౌగలించుకుంటారు. పెద్ద చిన్నా ఎవరూ రాజశేఖర్కు సపోర్ట్ చేయలేదు. దీంతో రాజశేఖర్ రాజీనామా చేశారు’’ అన్నారు.
ఎన్టీఆర్ బాధపడ్డారు..
‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయ వాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదన్నారు జీవిత. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా ఉన్న వాళ్లు ఏమైనా తెలుగు వాళ్లా? అని ప్రశ్నించారు. ‘‘ఇటీవల ఓ వేడుకలో ఎన్టీఆర్ను కలిశా. ‘మీరు నాకు ఓటు వేయాలి’ అని ఆయన్ని అడిగా. ‘నన్ను అడగొద్దమ్మా.. నేను రానమ్మా.. జరుగుతున్నది చూస్తుంటే నిజంగా బాధాకరంగా ఉందమ్మా’ అని అన్నారు. నిజంగా ఆయన చెప్పినట్లు పరిస్థితి అలాగే ఉంది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్