MAA Elections: బాలకృష్ణ మనసున్న వ్యక్తిలా వ్యవహరించారు

గత సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేశ్‌ ఓటమికి ప్రచారం చేసినప్పటికీ.. అవేమీ మనసులో పెట్టుకోకుండా బాలకృష్ణ మంచి మనసున్న వ్యక్తిలా వ్యవహరించారన్నారు నటుడు మంచు మోహన్‌బాబు.

Updated : 15 Oct 2021 04:10 IST

త సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేశ్‌ ఓటమికి ప్రచారం చేసినప్పటికీ.. అవేమీ మనసులో పెట్టుకోకుండా బాలకృష్ణ మంచి మనసున్న వ్యక్తిలా వ్యవహరించారన్నారు నటుడు మంచు మోహన్‌బాబు. ‘మా’ ఎన్నికల్లో బాలయ్య తన తనయుడు మంచు విష్ణుకి మద్దతునివ్వడం పట్ల మోహన్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. ఆయన గురువారం తన తనయుడు విష్ణుతో కలిసి నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి.. మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 16వ తేదీన ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలియజేశారు. ఆ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని బాలయ్యను కోరారు. అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ‘‘బాలకృష్ణ ఎంతో సంస్కారమున్న వ్యక్తి. గత సాధారణ ఎన్నికల్లో మంగళగిరిలో బాలయ్య అల్లుడు లోకేశ్‌ ఓటమి కోసం ప్రచారం చేశాను. కానీ, ఆయన అవేమీ మనసులో పెట్టుకోకుండా ‘మా’ ఎన్నికల్లో విష్ణుకు తన ఆశీర్వాదం అందించారు. ‘మా’ భవన నిర్మాణంలోనూ విష్ణుకు తోడుగా ఉంటానని చెప్పార’’న్నారు. అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘ఇప్పటికే కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, పరుచూరి బ్రదర్స్‌ లాంటి సినీపెద్దల్ని కలిశానని, త్వరలోనే మిగిలిన పరిశ్రమ పెద్దల్ని కలుస్తాం. ప్రమాణ స్వీకారానికి ప్రకాశ్‌రాజ్‌తో సహా వాళ్ల ప్యానెల్‌ను ఆహ్వానిస్తామ’’న్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని