Alitho Saradaga: ‘మర్యాద రామన్న’ సినిమా నాకు మైనస్ అయింది: నాగినీడు
‘‘మర్యాద రామన్న’ చిత్రం నన్ను ఓ స్థాయిలో నిలబెట్టింది. కానీ, అదే నాకు మైనస్ అయింది’ అని నటుడు నాగినీడు అన్నారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘మర్యాద రామన్న’ చిత్రం నన్ను ఓ స్థాయిలో నిలబెట్టింది. కానీ, అదే నాకు మైనస్ అయింది’ అని నటుడు నాగినీడు అన్నారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు పంచుకున్నారు. ఆలీ అడిగిన ప్రశ్నలకు కొంటె సమాధానాలు చెప్తూ అలరించారు. ‘నాగినీడు.. ముందు ఏంటి? వెనక ఏంటి?’ అని ఆలీ అడగ్గా ‘1760 అనుకుంటా. నేను మచిలీపట్నం నుంచి తిరిగొస్తుంటే కలవపాముల గ్రామంలో నన్ను ఆపి ఈ ఊరు శిథిలమైపోయిందని, బాగు చేయాలని నన్ను అడిగితే అక్కడ సెటిల్ అయిపోయా. కొంతకాలం తర్వాత వెళ్లిపోయా. మళ్లీ వచ్చా. మళ్లీ వెళ్లిపోయా, వచ్చా’ అంటూ ఆలీని కన్ఫ్యూజ్ చేశారు. ‘మీకు ఎంతమంది పిల్లలు’ అనే ప్రశ్నకు ‘నాకు రెండు మైనస్లు (కొడుకులు)’ అని చమత్కరించారు.
‘నా జీవితం ప్రసాద్ ల్యాబ్స్కి అంకితమైంది. నేను థియేటర్లో చూసిన తొలి చిత్రం ‘పూల రంగడు’ (అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కింది). చూసిన వెంటనే నటుడవ్వాలనే కోరిక కలిగింది. అదే సమయంలో రాజబాబుగారిని ఇమిటేట్ చేసేవాడ్ని. నేను నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రం నన్ను ఓ స్థాయికి తీసుకెళ్లింది. కానీ, అదే మైనస్ అయింది. అవకాశం కోసం ఏ దర్శకుడినైనా సంప్రదిస్తే ‘నాగినీడుగారు.. మీరు మాత్రమే న్యాయం చేయగలరు అనే పాత్ర ఉంటే మీకు ఇస్తాం. మా సినిమాలో అలాంటి క్యారెక్టర్ లేదు. మిమ్మల్ని సాధారణ పాత్రల్లో ఊహించుకోలేం కదా’ అనేవారు. ఇవన్నీ ఎందుకు నాకు డబ్బొస్తే చాలు అని మనుసులో అనుకునేవాడ్ని’ అని తన సినీ కెరీర్ గురించి చెప్పారు. చివరిగా.. ఓ దర్శకుడు తనపై సీరియస్ అయిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. మరి ఆ దర్శకుడు ఎవరు? తెలియాలంటే నవంబరు 15 వరకు వేచి చూడాల్సిందే. ‘ఈటీవీ’ వేదికగా వచ్చే సోమవారం ఈ ఎపిసోడ్ ప్రసారంకానుంది.
‘చెన్నకేశవరెడ్డి’, ‘లక్ష్మి కల్యాణం’ తదితర చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన నాగినీడుకు ‘మర్యాద రామన్న’ చిత్రం మంచి గుర్తింపునిచ్చింది. రామినీడుగా కనిపించి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు. సునీల్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఆ తర్వాత ‘పిల్ల జమీందార్’, ‘సీమ టపాకాయ్’, ‘ఇష్క్’, ‘బెంగాల్ టైగర్’, ‘స్పైడర్’, ‘రూలర్’, ‘వకీల్సాబ్’ తదితర చిత్రాలతో అలరించారు.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Cinema Posters: పండగ వేళ.. సినీ పోస్టర్ల కళ కళ
శ్రీరామ నవమి సందర్భంగా పలు చిత్ర బృందాలు సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్లని విడుదల చేశాయి. నాయకానాయికల సరికొత్త లుక్ని పరిచయం చేస్తూ ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశాయి. ఆ స్టిల్స్ చూసేయండి..
-
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
ఉదయనిధి బ్యానర్తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు చెందిన నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్తో తనకు గతంలో వివాదం జరిగిందని నటుడు విశాల్ (Vishal) అన్నారు. ఆ విషయం ఉదయనిధికి తెలుసో లేదో తనకు తెలియదన్నారు. -
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్తో అలరించిన రణ్వీర్ సింగ్
శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సినీ తారల కోసం తాజాగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
రంగంలోకి రాజాసాబ్
‘రాజాసాబ్’ కోసం మళ్లీ రంగంలోకి దిగుతున్నారు కథానాయకుడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. -
తొలి హిందీ చిత్రం కాస్త ఆలస్యం?
భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది కీర్తి సురేశ్. త్వరలో ఆమె ‘బేబీ జాన్’తో ప్రేక్షకులను పలకరించనుంది. -
ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు
‘‘స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ‘పారిజాతపర్వం’. దీంట్లో అపరిమితమైన వినోదం ఉంది. తప్పకుండా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం’’ అన్నారు హీరో చైతన్య రావు -
రెండు కోణాల్లో తమన్నా?
ది అన్టోల్డ్ స్టోరీ’, ‘రుస్తుం’, ‘టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథా’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్ని ప్రేక్షకులకు అందించారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే. -
రామోజీ ఫిల్మ్సిటీలో అక్షయ్ సందడి
బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడీ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. -
అమితాబ్కు లతా మంగేష్కర్ పురస్కారం
పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు ఇవ్వనున్నట్లు మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని వారు ఏర్పాటు చేశారు -
నిజం చెప్పే హీరోలకు సలాం కొట్టు!
‘ప్రతినిధి 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నారా రోహిత్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మూర్తి దేవగుప్తపు తెరకెక్కించారు -
వాస్తవ జీవిత కథే ఆధారం
‘‘ప్రేమకథతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మీ’. ఇందులో మేము ఒక కొత్త అంశాన్ని స్పృశించాం. అది తప్పకుండా ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు దర్శకుడు వీఎస్ ముఖేష్. -
కన్నడ నటుడు ద్వారకీష్ కన్నుమూత
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకనిర్మాత ద్వారకీష్(81) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో మంగళవారం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ప్రముఖ సంగీత దర్శకుడు కేజీ జయన్ మృతి
ప్రముఖ మలయాళీ సంగీత దర్శకుడు కేజీ జయన్(90) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ కేరళలోని త్రిపుణితురలోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. -
ఆ అమ్మాయి జోలికి రావద్దు
‘‘ఆ అమ్మాయి నా ప్రాణం.. నా ఊపిరి. తన జోలికొస్తే వెతుక్కుంటూ వచ్చి నరికేస్తా’’ అని హెచ్చరిస్తున్నారు విశాల్. మరి ఆయన ప్రేమ కథేంటి? దానికి ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలియాలంటే ‘రత్నం’ చూడాల్సిందే. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
-
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
-
మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్ట్
-
ప్రచారానికి తెర.. లోక్సభ ‘తొలి’ పోరుకు సర్వం సిద్ధం!
-
పీఎఫ్లో కీలక మార్పు.. ఇకపై చికిత్సకు రూ.లక్ష వరకు విత్డ్రా