Ranveer Singh: కత్రినాతో రణ్‌వీర్‌ ఢీ

కరోనా కారణంగా చాలా నెలల తరబడి విడుదల కోసం చూస్తున్నాయి పలు చిత్రాలు. ఇప్పుడు పరిస్థితులు కొంతమేర ఓ కొలిక్కి వచ్చాయి. అందుకే వచ్చే ఏడాది అయినా సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు

Updated : 27 Nov 2021 07:43 IST

కరోనా కారణంగా చాలా నెలల తరబడి విడుదల కోసం చూస్తున్నాయి పలు చిత్రాలు. ఇప్పుడు పరిస్థితులు కొంతమేర ఓ కొలిక్కి వచ్చాయి. అందుకే వచ్చే ఏడాది అయినా సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు రావాలని తహతహలాడుతున్నాయి. తాజాగా రెండు క్రేజీ చిత్రాలు విడుదల తేదీలు  ప్రకటించాయి. రణ్‌వీర్‌ సింగ్‌ ‘సర్కస్‌’, కత్రినాకైఫ్‌ ‘ఫోన్‌ భూత్‌’ చిత్రాలు ఒకే రోజున రానున్నాయి. ఈ రెండు చిత్రాలను వచ్చే ఏడాది జులై 15నే విడుదల చేయనున్నారు.  అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా ‘సూర్యవంశీ’ని తెరకెక్కించి భారీ విజయం అందుకున్నారు దర్శకుడు రోహిత్‌ శెట్టి. ఇప్పుడాయన రణ్‌వీర్‌సింగ్‌ కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘సర్కస్‌’. షేక్‌స్పియర్‌ నాటకం ‘ది కామెడీ ఎర్రర్స్‌’ ఆధారంగా కథ సాగుతుందని తెలుస్తోంది. పూజా హెగ్డే, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌లు నాయికలుగా నటిస్తున్న ఈ చిత్ర షెడ్యూల్‌ డిసెంబరు 1 నుంచి ఊటీలో మొదలుకానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని