Moon Moon Sen: మా అమ్మాయిలకీ చెబుతున్నా
చలన చిత్రోత్సవాలు ప్రాంతాల మధ్య సాంస్కృతిక వాహకాలుగా నిలుస్తాయన్నారు ప్రముఖ నటి మున్మున్ సేన్. మనం రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా వేరైనా భాషలు, ఆహారపు అలవాట్లు,...
చలన చిత్రోత్సవాలు ప్రాంతాల మధ్య సాంస్కృతిక వాహకాలుగా నిలుస్తాయన్నారు ప్రముఖ నటి మున్మున్ సేన్. మనం రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా వేరైనా భాషలు, ఆహారపు అలవాట్లు, అభిరుచుల మధ్య చాలా సారూప్యతలు ఉంటాయని, అవన్నీ ఇలాంటి కళా వేదికల ద్వారానే వెలుగులోకి వస్తాయని చెప్పారామె. 16 భాషల్లో నటించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు సుపరిచితం మున్మున్ సేన్. తెలుగులో ‘సిరివెన్నెల’లో నటించి ఉత్తమ క్యారెక్టర్ నటిగా నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న బెంగాలీ చలన చిత్రోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఆమె ‘ఈనాడు సినిమా’తో మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమాలతో నాది విడదీయలేని అనుబంధం. చిత్రోత్సవాల్లో భాగంగా సుదీర్ఘ కాలం తర్వాత హైదరాబాద్ నగరానికి రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో పురోగమిస్తోంది. మనదైన కథతో ‘బాహుబలి’ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించారు. బెంగాలీ చిత్రసీమ వాణిజ్య పరంగా మంచి ఫలితాలు సాధిస్తున్న క్రమంలో కొవిడ్ కుదేలు చేసింది. నటులు రోజుకి రూ.200, రూ.300కి నటించాల్సి వస్తోంది. కోలుకోవడానికి సమయం పడుతుంద’’న్నారు. నటిగా తన ప్రయాణం గురించి చెబుతూ ‘‘భారతీయ నటి అనిపించుకోవడమే లక్ష్యంగా సినిమాలు చేశా. మా అమ్మాయిలకి తెలుగుతోపాటు, అన్ని భాషల్లో నటించమని చెబుతున్నా. తెలుగు సినిమాలు చూస్తుంటాన’’న్నారు మున్మున్సేన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్