Skylab: ‘స్కైలాబ్’ విజయానికి ఆకాశమే హద్దవ్వాలి
‘‘ప్రీరిలీజ్ వేడుక అనగానే చిత్ర బృందంలో ఓ టెన్షన్ కనిపిస్తుంది. కానీ, ఈ ‘స్కైలాబ్’ టీమ్లో ఆ ఒత్తిడి కనిపించడం లేదు. పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ వచ్చినట్లు అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి.
- నాని
‘‘ప్రీరిలీజ్ వేడుక అనగానే చిత్ర బృందంలో ఓ టెన్షన్ కనిపిస్తుంది. కానీ, ఈ ‘స్కైలాబ్’ టీమ్లో ఆ ఒత్తిడి కనిపించడం లేదు. పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ వచ్చినట్లు అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి. సినిమా కొట్టేస్తున్నామని ఆ వైబ్ చెప్పేస్తుంటుంది. కొన్ని చిత్రాలకు ఇలా కుదురుతుంటుంది’’ అన్నారు కథానాయకుడు నాని. ఇటీవల జరిగిన ‘స్కైలాబ్’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సత్యదేవ్, నిత్యా మేనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. విశ్వక్ ఖండేరావు తెరకెక్కించారు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. ఈ సినిమా డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘‘స్కైలాబ్ గురించి చిన్నప్పుడు నేనూ చాలా కథలు విన్నా. అది మా ఊరి దగ్గర్లో పడిపోతుందని అందరూ భయపడ్డారట. అలాంటి ఓ ఆసక్తికర ఆలోచనతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు విశ్వక్. నిజానికి ఆయన ఈ కథ నాకు చెప్పాలనుకున్నాడట. మిస్ అయినందుకు చాలా బాధేసింది. కానీ, అది వెళ్లి మా నిత్య, పృథ్వీల చేతుల్లో పడింది కాబట్టి ఆనందంగా ఉంది. నిత్యా మేనన్తో ‘అలా మొదలైంది’ చేసి పదేళ్లు పూర్తయింది. సెట్లో ఇద్దరం చిన్నపిల్లల్లా ఉండేవాళ్లం. మణిరత్నం లాంటి దర్శకులకే ఫేవరెట్ యాక్టర్ నిత్య. తను ఏ భాషకు వెళ్లినా..మంచి నటి అని పేరు వినిపిస్తుంటుంది. అలాంటి తను ఈ సినిమాతో నిర్మాతగా మారిందంటే ఈ చిత్రం ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తను రామానాయుడు, దిల్రాజులా వందల సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. టికెట్ రేట్ల గురించి గతంలోనే మాట్లాడా. మళ్లీ మాట్లాడను. ఇక మిగతా వాళ్లు మాట్లాడాలి. చూద్దాం వాళ్లు మాట్లాడతారో లేదో. సత్యని ఎప్పుడు చూసినా స్టార్ అవబోతున్న నటుడిలా కనిపిస్తాడు. తనలా విభిన్న చిత్రాలు చేసే హీరోలు మనకు కావాలి. రాహుల్ అద్భుతమైన నటుడు. విశ్వక్కి ఆల్ ది బెస్ట్. ‘స్కైలాబ్’ విజయానికి ఆకాశమే హద్దవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.
‘‘నేను ఏదైతే సినిమాలో ఉండాలనుకున్నానో.. దానికి ప్రశాంత్ ఆర్ విహారి తన సంగీతంతో ప్రాణం పోశాడు. ఈ చిత్రానికి గొప్ప నటీనటులు దొరికార’’న్నారు దర్శకుడు విశ్వక్. నిత్యా మేనన్ మాట్లాడుతూ ‘‘నిజమైన భావోద్వేగాలు నిండి ఉన్న చిత్రమిది. నిర్మాతగానే కాదు.. నటిగానూ నాకెంతో తృప్తినిచ్చిన సినిమా ఇది’’ అంది. ‘‘ఇది మా తెలుగు సినిమా అని అందరూ గొప్పగా చెప్పుకొంటార’’న్నారు సత్యదేవ్. ఈ కార్యక్రమంలో వెంకట్ మహా, వివేక్ ఆత్రేయ, మున్నా, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు