Sirivennela: రచయితల కోసం పోరాడిన యోధుడు
‘‘ఆయన వ్యక్తిత్వమే.. కవిత్వం. కవిత్వమే ఆయన వ్యక్తిత్వం. అలా గొప్పగా జీవించిన మనిషి సీతారామశాస్త్రి. పాటే ప్రాణంగా బతికిన రచయిత. ఒక మంచి పాట రాసి వినిపించేవారు. రాస్తే వినేవారు. సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ కోసం రాసిన ‘దోస్త్’ పాట...
‘‘ఆయన వ్యక్తిత్వమే.. కవిత్వం. కవిత్వమే ఆయన వ్యక్తిత్వం. అలా గొప్పగా జీవించిన మనిషి సీతారామశాస్త్రి. పాటే ప్రాణంగా బతికిన రచయిత. ఒక మంచి పాట రాసి వినిపించేవారు. రాస్తే వినేవారు. సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ కోసం రాసిన ‘దోస్త్’ పాట గురించి అరగంట నాతో మాట్లాడారు. ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆయన నిద్రలేని రాత్రులెన్నో గడిపి... మనలో చైతన్యం నింపారు. స్ఫూర్తి రగిలించారు. ప్రేరణ ఇచ్చారు. హితోక్తి పలికారు. ప్రేమ పంచారు. ప్రశ్నించడం నేర్పారు. ఆయన ఓ పాటల గ్రంథాలయం. ‘తాజ్మహల్’ సినిమాకు నేను రాసిన పాట చూసి... ఆశీర్వదించారు. తర్వాత ‘పెళ్లిసందడి’ చిత్రానికి రాసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి.... ఆటోగ్రాఫ్ తీసుకున్నా. పాటలు ఎంతోమంది రాస్తారు. అయితే పాటల రచయితల కోసం నడుంబిగించి పోరాడిన వ్యక్తి సిరివెన్నెల. మా హక్కులకోసం ఎంతో శ్రమించారు. నిర్మాతలు, ఆడియో కంపెనీ అధిపతులతో మాట్లాడారు. రచయితల గుర్తింపు, రాయాల్టీ కోసం చట్టాలు చదివి, ఎన్నింటినో అధ్యయనం చేశారు. కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి పాటపై రచయిత హక్కుల కోసం నిరంతర కృషి చేశారు. ‘ఎవరో ఒకరు.. ఎపుడో.. అపుడు’ అని రాసిన సీతా రామశాస్త్రి... అన్నీ ఆయనై మమ్మల్ని నడిపించారు. అందుకే ఆయన భావనే.. జీవన. రాసిందే చేస్తారు. చేసేదే రాస్తారు. ఆదర్శకవి సిరివెన్నెల.’’
- చంద్రబోస్, గీత రచయిత
‘‘ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు కుడి భుజాన్ని కోల్పోయాననిపించింది. ఇప్పుడు నా ఎడమ భుజాన్ని కోల్పోయా. ఎంతో సన్నిహితంగా ఉండే ఆయన అనుకోకుండా మనల్ని వదిలి వెళ్లిపోయాడంటే నమ్మశక్యం కావడంలేదు’’.
- దర్శకుడు కె. విశ్వనాథ్
చీకటి ఏకాంతం ఎక్కువగా ఇస్తుంది. పాట రాయాలంటే నాలోకి నేను వెళ్తుండాలి. నాతో నేను మాట్లాడుకోవాలి. పోట్లాడుకోవాలి. అలా జరగాలంటే చాలా పొరల్ని దాటుకుంటూ వెళ్లాలి. ఆ సంఘర్షణకు రాత్రి అనువైన సమయం.
( సిరివెన్నెల రాత్రి పూట పాటలు రాయడం వెనుక ఆంతర్యం)
‘‘సిరివెన్నెల మనకిక లేదు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు. వేటూరిగారి తర్వాత అంత గొప్ప సాహిత్య విలువలను ఈ తరానికి అందించిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన భాషను అర్థం చేసుకోవడానికి మనకున్న పరిజ్ఞానం సరిపోదు. ఓ ఆత్మీయుడ్ని కోల్పోయా. గుండె బరువెక్కిపోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు.
-చిరంజీవి
కె.విశ్వనాథ్ పాటలొద్దు అన్నారంటే...!
కె.విశ్వనాథ్..సిరివెన్నెలది విడదీయలేని అనుబంధం. ఈయన పాట లేని విశ్వనాథ్ సినిమాని ఊహించ లేము. సినిమా పాటకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చిన సిరి వెన్నెల, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన విశ్వనాథ్ మధ్య ఓ సందర్భంలో ‘సినిమాకి పాటలెందుకు?’ అనే చర్చ వచ్చింది. ఈ విషయాన్ని ఓ సారి సిరివెన్నెల ‘ఈనాడు సినిమా’తో పంచుకున్నారు. ‘‘తన సినిమాల్లో పాటలకు అగ్రతాంబూలం ఇచ్చే విశ్వనాథ్ అంతటి వారే..‘పాటలొద్దు’ అన్నారంటే.. ఎందుకని ఆలోచించాలి కదా? మనసు ఆకలి, ఆత్మ ఆకలి తీర్చేది కవిత్వం. ఆ అవసరం ఉంటేనే అలాంటి పాటలు రాయాలి. హాలీవుడ్లో పాట ఎందుకు కనుమరుగై పోయింది. బాలీవుడ్లో పాట రీ రికార్డింగుల్లో ఎందుకు కలిసిపోతోంది? ఎందుకంటే.. పాట జనాలకు నచ్చడం లేదు. పాటలతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు హిట్టయ్యాయి. అంటే పాటలున్నా, లేకున్నా పట్టించుకోవడం లేదనే కదా అర్థం. చెప్పాల్సిన కథ సూటిగా చెప్పు. లేదంటే పాట అవసరమయ్యే స్థాయి కథ తీసుకో’’ అని చెప్పారు.
పంపిన కథలన్నీ వెనక్కొచ్చేశాయి..
సిరివెన్నెల తనలోని భావాల్ని పాటలుగానే కాదు.. కథల రూపంలోనూ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ, కథా రచయితగా మెప్పించలేకపోయారట ఆయన. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పంచుకున్నారు. ‘‘నా అనుభవాలతో కథలు రాసే ప్రయత్నం చేశా. వాటిలో ఓ పదిహేను కథలే ప్రచురితమయ్యాయి. పోస్టులో పంపితే రెక్కలు కట్టుకుని తిరిగి వచ్చేసిన కథలు ముప్పై ఉన్నాయి. ఇక సగంలో వదిలేసిన కథలు 400 ఉంటాయేమో. కథా రచనలో నా శైలి వేరు. కవితాత్మకంగా, చాలా క్లిష్టంగా ఉంటాయి. కథా నిర్వచనాలకు లొంగవు. అందుకే ఆ యుద్ధం నేను చేయలేదు. ఏడు కథల్ని ఎంచుకుని ‘ఎన్నో రంగుల తెల్లకిరణం’ అని ఓ పుస్తకం వేశాను’’ అని తన జ్ఞాపకాల్ని పంచుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మాటలు రాయమని అడిగారని కానీ, ఒప్పుకోలేదని చెప్పారు. ‘‘మూడు గంటల విషయాన్ని మూడు వాక్యాల్లో చెప్పడం అలవాటు చేసుకున్న వాడ్ని. మూడు వాక్యాల్లో చెప్పాల్సింది మూడు గంటలు చెప్పడమంటే కష్టమేగా’’ అనేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
రాఖీభాయ్ లుక్లో యశ్.. కేజీఎఫ్3 కోసమేనా?
కన్నడ నటుడు యశ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నెట్ఫ్లిక్స్లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్ఫ్లిక్స్లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
మేము సహ నటీనటులం మాత్రమే: రాశీఖన్నా
రాశీఖన్నా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా