Lakshya: పది పలకల దేహమైనా చేస్తా!
పడి లేచినవాడితో పందెం చాలా ప్రమాదకరం అని నిరూపించిన ఓ కుర్రాడి కథేమిటో తెలియాలంటే ‘లక్ష్య’ చూడాల్సిందే. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కేతిక శర్మ కథానాయిక. సంతోష్ జాగర్లపూడి
- నాగశౌర్య
పడి లేచినవాడితో పందెం చాలా ప్రమాదకరం అని నిరూపించిన ఓ కుర్రాడి కథేమిటో తెలియాలంటే ‘లక్ష్య’ చూడాల్సిందే. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కేతిక శర్మ కథానాయిక. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నారాయణ్దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ట్రైలర్ని ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ విడుదల చేశారు. బుధవారం చిత్రబృందం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘విలువిద్య మీద నేను చేసిన మొదటి సినిమా ఇది. ఎన్నో ప్రాచీన విద్యలు మరుగున పడుతున్నాయి. మనం దేవుళ్లుగా కొలిచేవారి చేతిలో, వీరులుగా చెప్పుకొనే వారి చేతిలో విల్లుని చూస్తాం. అన్నింటినీ ఆటలు అంటాం కానీ, ఆర్చరీని విలువిద్య అంటాం. నేను రాసుకున్న ఈ కథని నమ్మి అవకాశం ఇచ్చారు నిర్మాతలు. నేను రాసుకున్నది నలభై శాతమైతే, వంద శాతాన్ని చేశారు కథానాయకుడు. మూడు రోజులు కనీసం మంచినీళ్లు తాగకుండా ఎనిమిది పలకల దేహంతో నటించారు. రితిక పాత్రలో కేతికశర్మ చక్కటి అభినయం ప్రదర్శించింది. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ పాత్రలు చాలా బాగుంటాయి. రెండున్నరేళ్ల కష్టం ఈ సినిమా’’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘‘క్రీడా నేపథ్యంలో సినిమా అంటే హీరో గెలవాలి, ప్రేమకథ అంటే అమ్మాయి, అబ్బాయి కలవాలి. ఈ చిత్రంలోనూ అంతే కానీ, ఇందులో హీరో ఎలా గెలిచాడన్నది ఆసక్తికరం. ఈ కథ 8 పలకల దేహం కోరింది. నేను చేశా. పాత్ర కోరితే పది పలకల దేహమైనా చేస్తా. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్లతో కలిసి నటించడం మంచి అనుభవం. వారివల్లే నాలోని నటుడిని బయటికి తీసుకు రావాలనే కోరిక పుట్టింది’’ అన్నారు. నిర్మాత రామ్మోహన్రావు మాట్లాడుతూ ‘‘క్రీడా నేపథ్యంతో కూడిన సినిమాలు వచ్చి చాలా కాలమైంది. అందరిలోనూ దీనిపై ఆసక్తి ఏర్పడింది. నాగశౌర్య చాలా కష్టపడి పనిచేశార’’న్నారు. కేతిక శర్మ, జానవి తదితరులు
పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘రోమియో’ (Romeo). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్గురు’గా విడుదల చేశారు. -
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి