నగుమోము తారలే.. తెగిరాలె నేలకే

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి

Published : 03 Dec 2021 01:20 IST

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ చిత్ర లవ్‌ ఆంథమ్‌ని విడుదల చేశారు. ‘‘నగుమోము తారలే.. తెగిరాలె నేలకే.. ఒకటైతే మీరిలా.. చూడాలనే. సగమాయే ప్రాయమే.. కదిలేను పాదమే’’ అంటూ వినసొంపుగా సాగుతున్న మెలోడీ పాటకు జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు సమకూర్చగా.. కృష్ణకాంత్‌ సాహిత్యమందించారు. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. పాటలో ప్రభాస్‌.. పూజా హెగ్డేల జోడీ చూడముచ్చటగా కనిపించింది. పాట ఆరంభంలో ‘నేను రోమియోలా కాద’ని ప్రభాస్‌ చెప్పగా.. ‘కానీ, నేను జూలియట్‌నే.. నాతో ప్రేమలో పడితే చస్తావ్‌’’ అని పూజ రొమాంటిక్‌గా హెచ్చరించడం ఆకట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని