Akhanda: ‘అఖండ’తో నిజాలు చెప్పాం
‘‘ఒకప్పుడు ఎన్.టి.రామారావు తన సినిమాల ద్వారా భక్తిని బతికించారు. దైవ చింతన కొరవడిన ఇలాంటి తరుణంలో మళ్లీ ‘అఖండ’ భక్తిని బతికించిందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా’’ అన్నారు నందమూరి
- బాలకృష్ణ
‘‘ఒకప్పుడు ఎన్.టి.రామారావు తన సినిమాల ద్వారా భక్తిని బతికించారు. దైవ చింతన కొరవడిన ఇలాంటి తరుణంలో మళ్లీ ‘అఖండ’ భక్తిని బతికించిందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మాత. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విదేశాలతోపాటు, తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. గురువారం రాత్రి చిత్రబృందంతో కలిసి హైదరాబాద్లో సినిమాని వీక్షించారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల స్పందన పరమానందంగా ఉంది. ఒక చరిత్రని కళ్లముందు కట్టినట్టు, వాల్మీకిలా ఎంతో అద్భుతంగా బోయపాటి చిత్రీకరించారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ, అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకి నా అభినందనలు. తెలుగువాళ్లు కొత్తదనాన్ని ఎప్పుడూ ఆదరిస్తారు. దానికి నిదర్శనం ఈ సినిమానే. చిన్న పిల్లలు కూడా చాలా బాగుందని చెబుతున్నారు. ఇది కేవలం మా విజయం అనుకోవడం లేదు. ఇది చలన చిత్ర పరిశ్రమ విజయం. అందరూ కూడా కథలో లీనమై, సినిమాలో అంతర్భాగమై పనిచేశారు. ఇది కూడా ఓ పౌరాణికమే. ఎన్నో నిజాలు ఇందులో చెప్పాం. స్వతహాగా నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కాబట్టి ఇందులో చెప్పిన విషయాల్ని నేను కూడా బయట అందరి దగ్గర ప్రస్తావిస్తుంటా. మేమే కాదు, నా అభిమానులే కాదు, పరిశ్రమ మొత్తం ఎదురు చూసింది ఈ సినిమాకోసం. చరిత్రలో లేని పాత్రల్ని ఇంత సజీవంగా తెరపైకి తీసుకురావడం మాకు మాత్రమే చెల్లు. ఈ సినిమా ఈశ్వరేచ్ఛ. ముందు తరాలకి కూడా భక్తి అంటే ఏమిటో చెబుతుంది. తమన్ అద్భుతమైన బాణీలు అందించారు. సినిమా చూస్తున్నప్పుడు తెరపై కనిపించేది బాలకృష్ణనేనా అని నాకే అనిపించింది. ఇలా సమాజానికి మంచి సందేశం అందిస్తూ, సేవ చేసే అవకాశాన్ని అందిస్తున్న పార్వతీ పరమేశ్వరులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మళ్లీ నేను, బోయపాటి చేయబోయే సినిమా ఏమిటని ఇంకా ఆలోచించలేదు. అఘోరా పాత్ర కోసం, సహజత్వం కోసం రకరకాలుగా ఆలోచించి ఆ గెటప్ని ఎంపిక చేశాం. సినిమానే మా దైవం. నేను దర్శకుడి నటుడిని. ఆయన ఎలా చెబితే అలా చేస్తా. ఆ దేవుడే నాకు ఆ బలాన్నిస్తాడ’’న్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘అందరినోటా హిట్ అనే మాట వినిపిస్తోంది. ఈ విజయం సినిమాది, సినీ పరిశ్రమది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తమన్తోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?