బాలీవుడ్ ప్రముఖులకు అంతర్జాతీయ పురస్కారం
ప్రముఖ బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్పాయ్, నసీరుద్దీన్ షా, కొంకణా సేన్ శర్మ, దర్శకుడు హన్సల్ మెహతాలకు అంతర్జాతీయ గౌరవం దక్కింది. 2021కిగానూ ‘ఏషియన్ అకాడెమీ క్రియేటివ్ అవార్డ్స్’ వేడుక శుక్రవారం సింగపూర్లో జరిగింది.
ప్రముఖ బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్పాయ్, నసీరుద్దీన్ షా, కొంకణా సేన్ శర్మ, దర్శకుడు హన్సల్ మెహతాలకు అంతర్జాతీయ గౌరవం దక్కింది. 2021కిగానూ ‘ఏషియన్ అకాడెమీ క్రియేటివ్ అవార్డ్స్’ వేడుక శుక్రవారం సింగపూర్లో జరిగింది. ఈ వేదికపై ఆసియా ఫసిపిక్ దేశాల్లోని సృజనాత్మక రంగాల్లోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు. ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్సిరీస్లో నటనకుగానూ మనోజ్ బాజ్ పాయ్కు భారత్ నుంచి ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. ఆంథాలజీ సిరీస్ ‘అజీబ్ దాస్టాన్స్’లోని నటనకు కొంకణా సేన్ శర్మ ఉత్తమ నటిగా ఎంపికైంది. ‘స్కామ్ 1992’ షోకిగానూ ఉత్తమ డ్రామా సిరీస్, ఉత్తమ దర్శకత్వం విభాగాల్లో అవార్డు గెలుచుకున్నారు హన్సల్ మెహతా. ‘బండిష్ బండిట్స్’ వెబ్ సిరీస్లోని నటనకుగానూ నసీరుద్దీన్ షాకు ఉత్తమ సహాయనటుడి పురస్కారం లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ