వేసవిలో రామారావు డ్యూటీ
రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదల తేదీ ఖరారైంది. 2022 మార్చి 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించాయి సినీ వర్గాలు.
రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదల తేదీ ఖరారైంది. 2022 మార్చి 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించాయి సినీ వర్గాలు. దీంతో వేసవి బరిలో నిలిచే చిత్రాల జాబితాలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ చేరినట్టైంది. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రమిది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ నాయికలు. వేణు తొట్టెంపూడి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఎస్.ఎల్.వి.సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపిస్తారు. సోమవారం ఈ సినిమా విడుదల తేదీతో కూడిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశాయి సినీ వర్గాలు. అందులో రవితేజ స్టైలిష్ అవతారం ఆకట్టుకుంటోంది. నాజర్, నరేష్, పవిత్రాలోకేష్, సార్పట్టా జాన్ విజయ్, చైతన్యకృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధుసూధన్ రావు, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్.సి.ఎస్, ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్, కూర్పు: ప్రవీణ్.కె.ఎల్, కళ: సాహి సురేష్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..