Shriya: ఇంకో ఇరవయ్యేళ్లైనా ఇలాగే నటిస్తా!
‘‘వెండితెర నలుపు తెలుపు నుంచి... రంగుల సినిమాగా రూపాంతరం చెందడం ఎంత విప్లవాత్మకమో... ఇప్పుడూ అంతటి కీలకమైన మార్పునే సెట్స్లో చూస్తున్నాం’’ అంటోంది ప్రముఖ కథానాయిక శ్రియ శరణ్. ఇలా వచ్చి అలా కనుమరుగవుతున్న పరిస్థితుల్లోనూ... నటిగా తనదైన ముద్ర వేసి ఇరవయ్యేళ్లుగా తెలుగు తెరపై సందడి చేస్తున్న అరుదైన కథానాయిక ఈమె.
‘‘వెండితెర నలుపు తెలుపు నుంచి... రంగుల సినిమాగా రూపాంతరం చెందడం ఎంత విప్లవాత్మకమో... ఇప్పుడూ అంతటి కీలకమైన మార్పునే సెట్స్లో చూస్తున్నాం’’ అంటోంది ప్రముఖ కథానాయిక శ్రియ శరణ్. ఇలా వచ్చి అలా కనుమరుగవుతున్న పరిస్థితుల్లోనూ... నటిగా తనదైన ముద్ర వేసి ఇరవయ్యేళ్లుగా తెలుగు తెరపై సందడి చేస్తున్న అరుదైన కథానాయిక ఈమె. తొలినాళ్లలో ఎలా కనిపించేదో, ఇప్పుడూ అంతే అందంతో సందడి చేస్తోంది. ఓ బిడ్డకి జన్మనిచ్చిన శ్రియ ఇటీవల ‘గమనం’, ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాల్లో నటించింది. సుజనా రావు దర్శకత్వం వహంచిన ‘గమనం’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శ్రియ మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘చిన్నప్పట్నుంచే ఆరోగ్యంపై అవగాహన ఎక్కువ. అదంతా మా అమ్మ చలవే. యోగా, నృత్యం నేర్పించారు. అవే నా అందం వెనక రహస్యం. గర్భం దాల్చాక నాలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఆ సమయంలోనూ కథక్ చేస్తూ ఫిట్ నెస్పై దృష్టిపెట్టేదాన్ని. పిల్లలు పుట్టాక మన ప్రపంచమే మారిపోతుంది. రాధ పుట్టాక నాలోనూ చాలా మార్పులు వచ్చాయి. మేం ఎక్కడికి వెళ్లినా బ్యాగ్లు, సూట్కేసుల గురించే ఆలోచించేవాళ్లం. ఇప్పుడు ఎక్కడికెళ్లినా మా పాపని వెంటబెట్టుకుని వెళుతున్నాం. నాలో మార్పులు రావడమే కాదు, అమ్మగా బాధ్యతలూ పెరిగాయి’’.
* ‘‘మహిళా దర్శకులతో పనిచేయడం నాకు కొత్త కాదు. కన్నడలోనూ, దీపా మెహతా దర్శకత్వంలో ‘మిడ్నైట్ చిల్డ్రన్’ అనే ఆంగ్ల చిత్రమూ చేశా. తెలుగులో సుజనా రావుతో ఇదే తొలిసారి. ఇదివరకు సెట్స్లో నేను, నా హెయిర్ డ్రెస్సరే అమ్మాయిలు ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు అన్ని విభాగాల్లోనూ అమ్మాయిలు కనిపిస్తున్నారు. అదొక విప్లవాత్మకమైన మార్పు. మహిళల కథల్ని చెప్పడంతోపాటు... మహిళల సమస్యల్ని చర్చిస్తున్నాం. ఆ విషయంలో చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడొక విషయం చెప్పడానికి నేను ఏమాత్రం సిగ్గు పడటం లేదు. ఇదివరకు నెలసరి వస్తే, ఎంత నొప్పి ఉన్నా దర్శకులకి చెప్పే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు సెట్లో ఎక్కడ చూసినా అమ్మాయిలే కాబట్టి ఎవ్వరితోనైనా ఇలాంటి సమస్యల గురించి చెప్పుకోవచ్చు. కెమెరా వెనకాల అమ్మాయిలు ఎంత ఎక్కువగా ఉంటే, అంతగా అమ్మాయిల కథలు తెరపైకొస్తాయి’’.
* ‘‘దేవుడిపై నాకు నమ్మకం ఎక్కువ. మనల్ని నడిపించే ఓ బలమైన శక్తి ఉందని నమ్ముతాను. ఆ దేవుడు, ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఇరవయ్యేళ్లుగా ప్రయాణం చేస్తున్నా. మా నాన్న బీహెచ్ఈఎల్ ఉద్యోగి, మా అమ్మ లెక్కల టీచర్. అలాంటి ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను తెలుగు ప్రేక్షకులకు పక్కింటి అమ్మాయిలా మారిపోయా. నా తొలి సినిమా ‘ఇష్టం’ రోజులు నాకు ఇప్పటికీ గుర్తే. ఇన్నాళ్లూ సినీ పరిశ్రమలో ఉన్నందుకు గర్వపడుతున్నా. చేసిన సినిమాలు కొన్ని ఫలితాల్నిచ్చాయి, కొన్ని ఇవ్వలేదు. మంచి కలయికల్లోనూ, మంచి బృందాలతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. ఇరవయ్యేళ్లే కాదు, ఇంకో ఇరవయ్యేళ్లు ఇలాగే నటిస్తూనే ఉంటా. కరోనా సమయంలో నాకు సినిమాతో మరింత అనుబంధం ఏర్పడింది. చేసిన చిత్రాల్ని మళ్లీ మళ్లీ చూసుకున్నా. ‘మనం’ సమయంలో ఏఎన్నార్ సర్ చివరి సన్నివేశం చేస్తున్నప్పుడు నేనక్కడే ఉన్నా. ఒకవేళ నేను చనిపోతే, ఈ సినిమా చేసే చనిపోతా అనేవారు. అలా చివరి క్షణం వరకు నటిస్తూనే ఉండాలనేది నా కోరిక’’.
* ‘‘ఎప్పుడూ మనసుకు నచ్చిన పాత్రలే చేశా. ఇప్పుడైతే సినిమాల విషయంలో నా ధృక్పథం మరింతగా మారింది. నా కూతురు, నా కుటుంబం నా సినిమాలు చూస్తే గర్వపడేలా ఉండాలి. అలాంటి పాత్రల్లోనే నటించాలనేది నా సిద్ధాంతం. ఇలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడే ‘గమనం’ కథ విన్నా. వినగానే నా కంట్లో నీళ్లు సుడులు తిరిగాయి. వెంటనే చేస్తానని చెప్పా. మనుషుల్లో జరిగే అంతర్గత సంఘర్షణ, వాళ్ల ప్రయాణమే ఈ చిత్రం. నిస్సహాయురాలైన కమల అనే మహిళగా కనిపిస్తా. కమలలా మా అమ్మ ఇప్పటికీ ఇంట్లో టైలరింగ్ చేస్తూ ఉంటారు. దివ్యాంగురాలిగా కనిపించే కమల నాకు చాలా రకాలుగా సవాల్ విసిరిన పాత్ర. మూడు కథల సమాహారం ఈ చిత్రం. ఈ కథలకీ, ప్రకృతి విపత్తుకీ సంబంధం ఉంటుంది. అదెలా అనేది తెరపైనే చూడాలి. బుర్రా సాయి మాధవ్, జ్ఞానశేఖర్, ఇళయరాజాలతో కలిసి చేసిన ఈ సినిమా ప్రయాణం గుర్తుండిపోతుంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...