Kritishetty: కృతి కోసం ఓ కథ?

కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథలనగానే సీనియర్‌ భామలే గుర్తుకొస్తారు. బోలెడంత అనుభవం సంపాదించిన స్టార్‌ కథానాయికలకే అలాంటి అవకాశాలు దక్కుతుంటాయి. కానీ తొలి అడుగుల్లోనే కృతిశెట్టి కోసం అలాంటి ఓ కథ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Published : 12 Dec 2021 14:16 IST

థానాయిక ప్రాధాన్యం ఉన్న కథలనగానే సీనియర్‌ భామలే గుర్తుకొస్తారు. బోలెడంత అనుభవం సంపాదించిన స్టార్‌ కథానాయికలకే అలాంటి అవకాశాలు దక్కుతుంటాయి. కానీ తొలి అడుగుల్లోనే కృతిశెట్టి కోసం అలాంటి ఓ కథ సిద్ధమైనట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఆమె అందులో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాజ్‌తరుణ్‌తో ‘ఉయ్యాలా జంపాలా’, నానితో ‘మజ్ను’ చిత్రాల్ని తెరకెక్కించిన విరించి వర్మ... కథా   నాయిక ప్రాధాన్యం ఉన్న ఓ కథని సిద్ధం చేసినట్టు తెలిసింది. ఆ కథ కోసం కృతిశెట్టిని ఎంపిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. చిరు తనయ సుస్మిత ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఉప్పెన’తో తళుక్కున మెరిసిన కృతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో నటించింది. ‘బంగార్రాజు’లోనూ నాగచైతన్యకి జోడీగా నటిస్తోంది. సుధీర్‌బాబు, నితిన్‌లతోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని