Brahmastra:‘బ్రహ్మాస్త్ర’ కొత్త అనుభూతినిస్తుంది
‘‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో ఓ బ్రహ్మాండాన్ని సృష్టించనున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. అందుకే ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంద’’న్నారు దర్శకుడు రాజమౌళి. రణ్బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది.
‘‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో ఓ బ్రహ్మాండాన్ని సృష్టించనున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. అందుకే ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంద’’న్నారు దర్శకుడు రాజమౌళి. రణ్బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకి.. దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ‘‘మూడేళ్ల క్రితం కరణ్ జోహార్ నాకు ఫోన్ చేశారు. ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్నాం.. అయాన్ ముఖర్జీ మిమ్మల్ని ఓసారి కలవాలనుకుంటున్నాడని చెప్పారు. నేను ఓకే అనడంతో అయాన్ నన్ను హైదరాబాద్ వచ్చి కలిశాడు. తనతో మాట్లాడినప్పుడు సినిమా పట్ల అతనికున్న ప్రేమ చూసి.. ‘ఇతనెవరో నాకంటే పిచ్చోడులా ఉన్నాడ’ని అనుకున్నా. తర్వాత ‘బ్రహ్మాస్త్ర’ గురించి సీరియస్గా ఆలోచించా. అయాన్ ఈ సినిమాతో ఓ బ్రహ్మాండాన్ని క్రియేట్ చేస్తున్నాడని అర్థమైంది. ఇది నాకు ‘బాహుబలి’ని గుర్తు చేసింది. దాంతో ఈ చిత్రంలో నేనూ భాగం కావాలని నిర్ణయించుకున్నా. ఇది మూడు భాగాల సినిమా. తొలి భాగం చూశా నాకెంతో నచ్చింది. ఆధునిక సాంకేతికతతో.. భారతీయ సంస్కృతికి చెందిన ఇతివృత్తాలను దీంట్లో ఆకట్టుకునేలా చూపించనున్నారు. అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి’’ అన్నారు. ‘‘అమితాబ్, రణ్బీర్, అలియా, అయాన్ల బృందంతో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవం. ఈ ప్రాజెక్ట్లోకి రాజమౌళిని తీసుకురావడం గర్వకారణం’’ అన్నారు హీరో నాగార్జున. దర్శకుడు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ.. ‘‘ఇది నా కల. మునుపెన్నడూ చూడని ఓ సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించేందుకే ఇంత కష్టపడుతున్నాం. రాజమౌళి సర్ ఈ చిత్రంలో భాగమవ్వడం ధైర్యాన్నిచ్చింది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. మంచి కథ వస్తే.. తెలుగు, తమిళంలోనూ చేయాలని ఉంది. భాష నేర్చుకుని మరీ సినిమా చేస్తా’’ అన్నారు. రణ్బీర్. కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ‘‘అయాన్ ఈ సినిమాని అద్భుతంగా తీశాడు. రణ్బీర్ ఈ చిత్రం కోసం ఏడేళ్లగా శ్రమిస్తున్నాడ’’న్నారు. ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నా’’ అంది నటి అలియా భట్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు