ఆ రెండు కొని అమ్మకి ఇచ్చేవాణ్ని
‘కళ్లు.. కళ్లూ ప్లస్సు...వాళ్లు వీళ్లు మైనస్’ అంటూ సినిమా పాటలకు లెక్కల సూత్రాలు బోధించిన మాస్టారాయన. విలన్ పరిగెత్తే వేగానికి ... వాడు కింద పడాలంటే ఎన్ని డిగ్రీల కోణంలో వస్తువు విసరాలో చెప్పి... ఫైట్లలో భౌతికశాస్త్రాన్ని చొప్పించిన...
దర్శకుడు సుకుమార్ సంక్రాంతి జ్ఞాపకాలు...
‘కళ్లు.. కళ్లూ ప్లస్సు...వాళ్లు వీళ్లు మైనస్’ అంటూ సినిమా పాటలకు లెక్కల సూత్రాలు బోధించిన మాస్టారాయన. విలన్ పరిగెత్తే వేగానికి ... వాడు కింద పడాలంటే ఎన్ని డిగ్రీల కోణంలో వస్తువు విసరాలో చెప్పి... ఫైట్లలో భౌతికశాస్త్రాన్ని చొప్పించిన గురువాయన. సన్నివేశాల్లో రసాయన శాస్త్రాన్ని... మాస్ డైలాగుల్లో తత్వ శాస్త్రాన్ని చెప్పగల లెక్చరరాయన. ‘పుష్ప’తో తెలుగు కథను పాన్ఇండియా స్థాయిలో చెప్పి మెప్పించారాయన. ఆ విజయానందంలో ఈసారి సంక్రాంతి జరుపుకోనున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ను ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా పలుకరించింది. తన జీవితంలోని మూడు దశల్లో ముఖ్యమైన సంక్రాంతుల గురించి చెప్పమని కోరింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘సంక్రాంతికి మా ప్రాంతంలో మంచు దుప్పటి కప్పుకొని ఉంటుంది. మనిషికి మనిషి కన్పించనంతగా పొగమంచు. భలే ఉండేది ఆ వాతావరణం. మా పెద్దక్క నలుగుపిండి పెట్టి, కుంకుడు పోసి... బాగా స్నానం చేయించేది. ఏడ్చినా వదిలిపెట్టేది కాదు. మా నాన్న (తిరుపతి నాయుడు) అందరికీ కొత్త బట్టలు కుట్టించేవాడు. మా నాన్న ఫ్రెండే టైలర్. ఆయన పేరు చిన్నంశెట్టి. ఒకే రంగు క్లాత్ తెచ్చి అందరికీ నిక్కరు, షర్టులు... మా ఇంటి దగ్గరే టైలర్లు మిషన్లు పెట్టేవారు. ఉదయాన్నే కొత్త బట్టలు కట్టుకొని... పొగమంచులో పరిగెత్తుతూ భలే ఆడుకునే వాళ్లం. నాకు ఇష్టమని అమ్మ(వీర వేణి) బూరెలు చేసేది. అందులోని పూర్ణం అంటే ఇంకా ఇష్టం. నాకోసం దాన్ని అమ్మ పక్కకు తీసి ఉంచేది.
* ఇంటి ముందు అలకడానికి, గొబ్బెమ్మలు చేయడానికి ఆవు పేడ తీసుకురావడం అనేది పెద్ద పని. గేదె పేడ వాడేవారు కాదు. ఆవు పేడ కిందపడకుండా పట్టుకురావాలి. తట్టలు పట్టుకొని ఆవుల వెనుకే తిరిగేవాళ్లం. ఇది భలే తమాషాగా ఉండేది.
* ఇంకా సంక్రాంతి అంటే నాకు బాగా గుర్తొచ్చేది శివకోడు ముసలమ్మ తీర్థం. అది పెద్ద సంత అన్నమాట. అక్కడ చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మల దగ్గర నుంచి ఆడపిల్లలకు, ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు, వ్యవసాయ పరికరాలు ఇలా... అన్నీ అమ్మేవారు. అక్కడ మా పెద్దనాన్న మిఠాయి కొట్టు పెట్టేవారు. మా పెద్దనాన్న పేరు వెంకటరత్నం. ఇంకో పెద్దనాన్న సూర్రావు. చిన్న పెద్దనాన్నకు ఊర్లో కొట్టు ఉండేది. అందుకు ఆయన్ను కొట్టునాన్న అనే వాళ్లం. వెంకటరత్నం పెద్దనాన్న నడిపే మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్లే వాళ్లం. అక్కడ జీడి పాకం బాగుంటుంది. మా సూర్రావు పెద్దనాన్న... వెంకటరత్నం పెద్దనాన్నకు తెలియకుండా జీడిపాకం ఇచ్చేవారు. మేం దాన్ని తీసుకొని పక్కకు వెళ్లి తినేసేవాళ్లం. తీర్థంలో పెద్ద నాటక సంస్థలు వచ్చి నాటకాలు ఆడేవారు. కనుమ రోజు రికార్డింగ్ డ్యాన్స్లు పెట్టేవారు.
* తీర్థంలో ఏమైనా కొనుక్కోవడానికి డబ్బులిస్తే..తను తక్కువ ఉపయోగించుకొని, అందులో ఎక్కువ నాకే ఇచ్చేది మా చిన్నక్క. మా అమ్మకు పకోడి, ఖర్జూర పళ్లంటే ఇష్టం. ఆ రెండు కొనుక్కొని అమ్మకు ఇచ్చేవాడిని. పాకుండలు అనే ఒక మిఠాయి లాంటిది తయారుచేసేవాళ్లు. నెల రోజుల పాటు నిల్వ ఉండేవి. అవి ఎక్కువగా తినేవాళ్లం. పోయిన వస్తువులు దొరకాలని ముసలమ్మకు మొక్కుకొనే వాళ్లం. పెన్నులు, నోట్్సలు, పెన్సిళ్లు.. ఇలాంటివి అన్నమాట. అదో నమ్మకం. అవి తిరిగి దొరికితే... అమ్మకు 5పైసలు... అలా హుండీలో వేస్తామని మొక్కుకొనేవాళ్లం.
* చిన్నపిల్లలం పరికొసలతో దండలు చేసేవాళ్లం. ఎవరు పొడుగ్గా చేస్తే వాళ్లు గొప్పన్నమాట. ఎవరిదైనా పొడుగ్గా ఉందంటే... దాన్ని కొలిచి... దానికంటే పెద్దది చేయాలని ప్రయాసపడేవాళ్లం. చివరికి అవి ఎంత పెద్దవి అయ్యేవంటే... మోసుకెళ్లలేనంత. భోగికి ముందు రోజు యువకులేమో జట్లుగా తయారయ్యేవారు. ఊర్లో ఇళ్ల దూలాలు, మంచాలు, కొట్టిన చెట్లు... ఇలా అన్ని దొంగతనంగా సేకరించేవారు. ఉదయాన్నే వాటిని భోగిమంటల్లో వేసేవారు. అలా వేసేటప్పుడు చాలామంది వచ్చి... ఇది మాదని గొడవలు పడేవారు. ఇదంతా చాలా సరదాగా ఉండేది. ఊరి వీధుల్లో పరిగెత్తే లేగదూడల్లా.. ఆ రోజుల హుషారే వేరు.’’
ఆ సంక్రాంతికి అనువాదకుడిని
నా భార్య పేరు తబిత. ఆమెది తెలంగాణ. మాదేమో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర మట్టపర్రు. మా అమ్మ వీర వేణి పూర్తి గోదావరి యాసలోనే మాట్లాడుతుంది. తబితది పూర్తిగా తెలంగాణ యాస. దీంతో ఆమె మాట్లాడే తెలంగాణ యాస అమ్మకు పూర్తిగా అర్థమయ్యేది కాదు. అమ్మ చెప్పేది తనకు తెలిసేది కాదు. పెళ్లైన ఏడాది వచ్చిన సంక్రాంతికి ఊరికి తీసుకెళితే.. వాళ్లిద్దరి మధ్య నేను అనువాదకుడిలా ఉండేవాడిని(నవ్వుతూ). భోగి పిడకలు తయారు చేయడం ఆమెకు అసలు రాదు. ఆ సంక్రాంతికి తబితను ఊరంతా తిప్పాను. నా స్నేహితులు, బంధువులను పరిచయం చేశా. నేను చదివిన బడి, ఆడుకున్న ప్రదేశాలు, కాల్వ గట్లు... ఇలా అన్నీ తిప్పి చూపించా. జీవిత భాగస్వామితో... జీవితంలో భాగమైన విషయాలు పంచుకోవడం... ఓ తియ్యని వేడుక. ఎన్ని సంక్రాంతులు వచ్చినా... బాల్యంలోని మధుర జ్ఞాపకాలే అప్పటి మంచు తెరల్లా హృదయాన్ని కప్పేస్తుంటాయి. తెలుగు లోగిళ్లలానే మనసును కళకళలాడేలా చేస్తుంటాయి.’
ప్రశాంతంగా పండగ...
పరిశ్రమలోకి వచ్చాక... నాకు సంతోషంగా అనిపించిన సంక్రాంతి... అంటే వన్ నేనొక్కడినే కథ ఓకే అయిన సంవత్సరం. సాధారణంగా నా సినిమాలు వేసవిలో విడుదలకు సిద్ధం చేస్తుంటా. అప్పుడు సిద్ధం చేయాలంటే... జనవరిలో బాగా పని ఉంటుంది. ఊపిరిసలపనంత పని ఉంటుంది. పండగ రోజుల్లో షూటింగ్ లేకపోయినా... ఏదో టెన్షన్ మైండ్ నిండా ఉంటుంది. సినిమాకు సంబంధించిన విషయాలే నన్ను వెంటాడుతుంటాయి. అవి నన్ను కుదురుగా ఉండనివ్వవు. మిగతా సమయాల్లో కథ నాకు అంత త్వరగా తృప్తి నివ్వదు. అందుకే నేను కథను పూర్తి చేయలేను. ఎన్నో ప్రశ్నలు వేధిస్తుంటాయి. దాంతో కుస్తీ పడుతుంటా... చర్చిస్తుంటా... అలా మనశ్శాంతే ఉండదు. అందుకే ఎప్పుడు సంక్రాంతి వచ్చినా నేను పెద్ద ఎంజాయ్ చేసినట్లు నాకు గుర్తులేదు. 2012లో మాత్రం వన్ నేనొక్కడినే కథ మొత్తం పూర్తి చేసి, సినిమా ఓకే చేయించుకొన్నా. షూటింగ్కు ఇంకా చాలా సమయం ఉంది. మెదడుకు ఎలాంటి టాస్క్లు లేవు. హాయిగా, ప్రశాంతంగా ఉన్నా. ఆ ఏడాది ఊరికెళ్లి... సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేశా. తెలుగు వాకిళ్లన్నీ తోరణం కట్టి ఆహ్వానించి, అభిమానించే సినిమాల్లో నేను భాగమై ఉండటాన్ని అదృష్టంగా భావిస్తుంటా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Allari Naresh: అలాంటివాళ్ల టెన్షన్ను.. నవ్విస్తూ చూపించాం: అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ (Allari Naresh) నటించిన వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్. నరేశ్, ఫరియా, జెమీ లివర్ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా