Chiranjeevi: ఏప్రిల్‌ 1న ‘ఆచార్య’

చిరంజీవి, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్‌ 1న విడుదల కానుంది. ఆ విషయాన్ని చిత్రబృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇదివరకు ఈ సినిమాని ఫిబ్రవరి 4న విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే

Updated : 17 Jan 2022 06:30 IST

చిరంజీవి, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్‌ 1న విడుదల కానుంది. ఆ విషయాన్ని చిత్రబృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇదివరకు ఈ సినిమాని ఫిబ్రవరి 4న విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. అయితే కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి వాయిదా వేస్తూ, ఏప్రిల్‌ 1గా కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ సమర్పిస్తోంది. చిరుకి జోడీగా కాజల్‌, రామ్‌చరణ్‌కి జోడీగా పూజాహెగ్డే నటించారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని