వచ్చేదెవరు.. వెనక్కి తగ్గేదెవరు?
‘నేడే విడుదల’ అంటూ థియేటర్లో కొత్త పోస్టర్ ఊరిస్తుంటే సినీప్రియులకు భలే కిక్కొస్తుంటుంది. కానీ, కరోనా పరిస్థితుల వల్ల కొన్నాళ్లుగా విడుదలల విషయంలో స్పష్టత కనిపించడం లేదు. విడుదల
‘నేడే విడుదల’ అంటూ థియేటర్లో కొత్త పోస్టర్ ఊరిస్తుంటే సినీప్రియులకు భలే కిక్కొస్తుంటుంది. కానీ, కరోనా పరిస్థితుల వల్ల కొన్నాళ్లుగా విడుదలల విషయంలో స్పష్టత కనిపించడం లేదు. విడుదల తేదీలు ప్రకటించడం.. పరిస్థితులు అనుకూలించక కొన్నాళ్లకి వాయిదా వేయడం.. ఇదే తంతు తరచూ కనిపిస్తోంది. సంక్రాంతి.. వేసవి.. అంటూ విడుదలల విషయంలో నిన్నమొన్నటి వరకు పక్కా ప్రణాళికలతో కనిపించింది తెలుగు చిత్ర పరిశ్రమ. కానీ, కొవిడ్ మూడో దశ ఉద్ధృతి వల్ల మరోసారి ఆ ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. జనవరి ఆరంభం నుంచే వైరస్ ప్రభావం మొదలవడంతో.. పెద్ద పండక్కి రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి బడా చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడీ సెగ ఫిబ్రవరి చిత్రాలనూ తాకనున్నట్లు తెలుస్తోంది. ఓవైపు కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం.. ఏపీలో మంగళవారం నుంచి థియేటర్లపై కరోనా ఆంక్షలు మొదలైన నేపథ్యంలో ఫిబ్రవరిని లక్ష్యం చేసుకున్న చిత్రాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికి వచ్చేదెవరు? వెనక్కి తగ్గేదెవరు? అనేది ఆసక్తికరంగా మారింది.
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో.. ఇప్పటికే పలు రాష్ట్రాలు థియేటర్లపై ఆంక్షలు విధించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇన్నాళ్లు పూర్తి సామర్థ్యంతో నిరాటంకంగా సినిమా ప్రదర్శనలు కొనసాగాయి. అయితే మంగళవారం నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూతో పాటు థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీ అమలు కానుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రేసులో నిలిచిన చిత్రాల్లో.. వాయిదా బాట పట్టెవి ఎన్ని అన్నది ఆసక్తికరంగా మారింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి వినోదాలకు చిరంజీవి ‘ఆచార్య’తో మెగా ఓపెనింగ్ దక్కుండేది. కానీ, కరోనా పరిస్థితుల వల్ల ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన ఆ చిత్రాన్ని.. ఏప్రిల్ 1కి వాయిదా వేసినట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడీ బాటలో మరిన్ని పెద్ద సినిమాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.
రేసులో బోలెడన్ని..
సూర్య ‘ఈటీ’, రవితేజ ‘ఖిలాడీ’, అడివి శేష్ ‘మేజర్’, నిఖిల్ ‘18 పేజీస్’, అలియా భట్ ‘గంగూబాయి కథియావాడి’, పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ తదితర చిత్రాలన్నీ ఫిబ్రవరి బరిలో పోటీ పడేందుకు ఇప్పటికే బెర్తులు ఖరారు చేసుకున్నాయి. వీటిలో చాలా వరకు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. మరికొన్ని తుది దశ చిత్రీకరణలోనూ, ఇంకొన్ని నిర్మాణాంతర పనుల్లోనూ ఉన్నాయి. ఇప్పుడు వీటి రాకపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ‘ఈటీ’, ‘మేజర్’, ‘గంగూబాయి కథియావాడి’ల రాక కష్టమేనని తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో థియేటర్లపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రాలు వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. త్వరలో వీటి కొత్త విడుదల తేదీలపై ఓ స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘ఖిలాడి’ని ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లోనూ అదే తేదీకి వస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. కానీ, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అనుకున్న తేదీకి వస్తారా? మరో కొత్త తేదీ వెతుక్కుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్ కె.చంద్ర తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, సంభాషణలు సమకూరుస్తున్నారు. సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఫిబ్రవరి 25కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ తేదీనే లక్ష్యంగా చిత్రాన్ని శరవేగంగా ముస్తాబు చేస్తోంది చిత్ర బృందం. అయితే రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయన్న దాన్ని బట్టే ఈ చిత్ర విడుదల ఆధారపడి ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
చిన్న చిత్రాలు సాహసిస్తాయా?
తొలి దశ, రెండో దశ కొవిడ్ ఉద్ధృతుల తర్వాత థియేటర్లపై ఆంక్షలు ఉన్నా చిన్న చిత్రాల సందడి బాగానే కనిపించింది. పరిమిత వ్యయంతో తెరకెక్కిన పలు సినిమాలూ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ‘జాంబిరెడ్డి’, ‘లవ్స్టోరీ’, ‘రాజ రాజచోర’ లాంటి చిత్రాలు 50శాతం ఆక్యుపెన్సీ పరిస్థితుల మధ్యే విడుదలై మంచి వసూళ్లు దక్కించుకున్నాయి. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల మధ్య చాలా వైరుధ్యాలున్నాయి. ముఖ్యంగా ఏపీలో టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. నైట్ కర్ఫ్యూ వల్ల అక్కడ మూడు ఆటలే సాధ్యమవుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చిన్న చిత్రాలు థియేటర్లు ముందుకొచ్చే సాహసం చేస్తాయా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం ఆంధ్రాలో నైట్ కర్ఫ్యూ ఉన్నా.. అది రాత్రి 11గంటల తర్వాతే అమలు కానుంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల థియేటర్ల యాజమాన్యాలు సినిమా ప్రదర్శన వేళల్ని సర్దుబాటు చేసుకుని..నాలుగు ఆటలు వేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది వర్కవుటయితే ‘18 పేజీస్’ లాంటి చిన్న సినిమాల విడుదలకు ఆటంకం ఉండదని సినీ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రానున్న రోజుల్లో పరిస్థితుల్ని బట్టి దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tharun Bhascker: ‘కీడాకోలా’లో ఎస్పీ బాలు పాట.. లీగల్ నోటీసులపై తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే!
‘కీడా కోలా’ (Keedaa Cola)లో ఎస్పీ బాలు పాటను రీక్రియేట్ చేయడంతో నెలకొన్న వివాదంపై చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్పందించారు. -
Meetha Raghunath: వివాహబంధంలోకి అడుగుపెట్టిన ‘గుడ్నైట్’ స్టార్
రకుల్ ప్రీత్ సింగ్, నటాషా దోషి, కృతికర్భందా వంటి కథానాయికలు ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా.. తాజాగా ఆ జాబితాలోకి మరో యువ నటి చేరింది. -
upcoming movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో థ్రిల్లింగ్ కంటెంట్
గత వారం బాక్సాఫీస్ వద్ద పదికి పైగా చిన్న చిత్రాలు సందడి చేయగా, ఈ వారం కూడా అదే పంథా కొనసాగనుంది. థియేటర్లో మరికొన్ని చిన్న సినిమాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, సిరీస్లు సందడి చేయబోతున్నాయి. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్సింగ్’ టీజర్ రెడీ అవుతోందా?
‘ఉస్తాద్ భగత్సింగ్’ ప్రచార హంగామాకి తెర లేచింది. త్వరలోనే టీజర్ విడుదల చేయనున్నట్టు సమాచారం. రాజకీయ సంభాషణలతో ఆ టీజర్ ముస్తాబవుతోందని, ప్రస్తుత రాజకీయ వాతావరణానికి తగ్గట్టుగా అది ఉంటుందని తెలుస్తోంది. -
Ileana: అతడు నాకొక వరం
‘నన్ను నన్నుగా అర్థం చేసుకునే వ్యక్తి.. కష్టాల్లో తోడుండే నేస్తం.. నాకు దొరకడం అదృష్టం’ అంటోంది ఇలియానా. ఇదంతా తన భర్త మైఖేల్ డోలన్ గురించే. -
Sara Ali Khan: అమ్మే నా ధైర్యం
భిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ తక్కువ కాలంలోనే తనకంటూ మంచి క్రేజ్ను సంపాదించుకుంది బాలీవుడ్ నాయిక సారా అలీఖాన్. -
Lambasingi: కలలు నెరవేర్చిన ‘లంబసింగి’
‘‘ప్రతిభ ఉన్నా అవకాశాలు రాక ఇబ్బందులు పడేవాళ్లు చిత్రసీమలో చాలామందే. సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు దర్శకత్వం చేయడం కోసం నేనూ ఏడేళ్లు ఎదురు చూశా. -
Karthikeya 3: ‘కార్తికేయ 3’కి రంగం సిద్ధం
సరికొత్త సాహసంతో త్వరలోనే ‘కార్తికేయ 3’ తెరకెక్కనుందనే సంకేతాలిచ్చారు కథానాయకుడు నిఖిల్. ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
Nithiin: ‘ఇష్క్’ కలయిక మరోసారి
వరస ఫ్లాప్లతో ఇబ్బందిపడిన కథానాయకుడు నితిన్ మళ్లీ విజయాల బాట పట్టింది ‘ఇష్క్’ సినిమాతోనే. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించింది. -
Vishal: విశాల్ కొత్త ప్రయాణం
ఇప్పటిదాకా నటనతో అలరించిన సీనియర్ నటుడు విశాల్.. దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. గతంలో ఆయన నటించిన ‘డిటెక్టివ్’ మంచి విజయాన్ని అందుకుంది. -
Dhanush: అమరన్ దర్శకుడితో..?
గతేడాది ‘కెప్టెన్ మిల్లర్’తో మంచి విజయాన్ని అందుకున్నారు కథానాయకుడు ధనుష్. ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన.. దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. -
Cinema News: స్నేహితుల కథ ‘హద్దులేదురా’
ఆశిష్ గాంధీ, అశోక్ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం ‘హద్దు లేదురా’. వర్ష, హ్రితిక కథానాయికలు. రాజశేఖర్ రావి దర్శకత్వం వహించారు. -
Aadujeevitham: ఆ పాత్ర కోసం 31 కిలోలు బరువు తగ్గాను: పృథ్వీరాజ్ సుకుమారన్
పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
Social Look: అమృత ‘పాజిటివ్’ పోస్ట్.. అనుపమ సెల్ఫీ.. ప్రియాంకా చోప్రా న్యూ లుక్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
AP Congress: ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల..?
-
Bill Gates: ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను: బిల్ గేట్స్
-
PM Modi: భారాస తెలంగాణను దోచుకుంది.. కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది: జగిత్యాల సభలో మోదీ
-
WPL 2024 - RCB: డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. పురుషుల జట్టుపై నెట్టింట మీమ్స్!
-
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాల్సిందే.. ఎస్బీఐకి సుప్రీం డెడ్లైన్
-
Appsc: గ్రూప్-1 మెయిన్స్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అప్పీల్