మది మదినీ కదిలించే సరికొత్త ధారావాహిక మనసంతా నువ్వే..
ఓ అందమైన అమ్మాయి...అంతులేని ఐశ్వర్యం..ఆప్యాయతలు పంచే పొందికైన కుటుంబం..అన్ని అర్హతలూ ఉన్న ఓ అబ్బాయి విదేశాల నుంచి వచ్చి ‘మనసంతా నువ్వే’ అన్నాడు. అయినా..ఆ ప్రేమ
ఓ అందమైన అమ్మాయి...అంతులేని ఐశ్వర్యం..ఆప్యాయతలు పంచే పొందికైన కుటుంబం..అన్ని అర్హతలూ ఉన్న ఓ అబ్బాయి విదేశాల నుంచి వచ్చి ‘మనసంతా నువ్వే’ అన్నాడు. అయినా..ఆ ప్రేమ ప్రయాణానికి అడుగడుగునా ముళ్ల బాటలే ఎదురయ్యాయి. అయినవాళ్ల అనురాగాలే ప్రేమకి ప్రతిబంధకాలైతే...మంచి మనసులే ప్రేమికులకు పెనుశాపాలైతే..??
రేపటి నుంచి మనసంతా నువ్వే డైలీ సీరియల్
సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8.30గం.లకు ఈటీవీలో
అనూహ్యమైన మలుపులతో, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో సాగే సరికొత్త ధారావాహిక ‘మనసంతా నువ్వే’ రేపటి నుంచి ప్రతి రాత్రి 8.30 గం.లకు ఈటీవీలో ప్రారంభమవుతోంది. రాధాకృష్ణ టాకీస్ నిర్మిస్తున్న ఈ డైలీసీరియల్కు మలినేని రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇది కేవలం ఒక అబ్బాయి- అమ్మాయి మధ్య నడిచే వినూత్నమైన ప్రేమ కథ మాత్రమే కాదు..ఒక అన్నకి-చెల్లెకి మధ్య విడదీయలేని అనుబంధం వల్ల జరిగే ఘర్షణని, ఇద్దరు స్నేహితుల మధ్య అంతులేని అభిమానం వల్ల జరిగే సంఘర్షణనీ ప్రతి క్షణం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే కథాకథనాలతో అందిస్తుంది ‘మనసంతా నువ్వే’. ఇందులోని భావోద్వేగాలు అన్ని వయసుల వారినీ అమితంగా ఆకట్టుకుంటాయని ధృడంగా నమ్ముతున్నాం’’ అన్నారు. సీరియల్లో ముఖ్య పాత్రలో నటించిన ప్రముఖ నటుడు సంజయ్ భార్గవ్ మాట్లాడుతూ ‘‘చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, ఇంత కథాబలం కలిగిన ధారావాహికలో నటించడం ఎంతో తృప్తిని కలిగిస్తోంద’’ని అన్నారు. కేరళకు చెందిన ప్రముఖ నటీమణులు విందూజ- అశ్వతి ఈ సీరియల్లో ఇద్దరు కథానాయికలుగా నటించడం విశేషం. ఇంకా ఈ సీరియల్లో నవీన యాట, శ్రీలత, ఏకనాథ్, సంజయ్కుమార్, మాధవీలత, ఉదయభగవతుల తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు