టీజర్‌తో ‘సామాన్యుడు’

విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘సామాన్యుడు’. నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌.. అనేది ఉపశీర్షిక. తు.ప శరవణన్‌ దర్శకుడు. డింపుల్‌ హయాతి కథానాయిక. ఈ సినిమా రిపబ్లిక్‌ డే

Published : 18 Jan 2022 00:33 IST

విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘సామాన్యుడు’. నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌.. అనేది ఉపశీర్షిక. తు.ప శరవణన్‌ దర్శకుడు. డింపుల్‌ హయాతి కథానాయిక. ఈ సినిమా రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 19న చిత్ర టీజర్‌ విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని విశాల్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆ ప్రచార చిత్రంలో ఆయన ఓ చెక్క కూర్చిలో కూర్చొని సీరియస్‌గా చూస్తూ కనిపించారు. ‘‘విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే మంచి సందేశముంది. విశాల్‌ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయ. ఈ చిత్రంలో యోగిబాబు, పా తులసి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలందించారు. కెవిన్‌ రాజా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని