Naresh: అప్పుడు కోల్పోయింది..ఇప్పుడు ఆస్వాదిస్తున్నా
‘‘50ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత ఇప్పటికీ కొత్త పాత్రలు వేస్తున్నాను. ఇదంతా నా కోసం పాత్రలు సృష్టిస్తున్న రచయితలు, నన్ను ప్రోత్సహిస్తున్న దర్శకులు, ఆదరిస్తున్న ప్రేక్షకుల వల్లే సాధ్యమవుతోంది’’ అన్నారు సీనియర్ నటుడు నరేష్. ప్రస్తుతం తెలుగు
‘‘50ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత ఇప్పటికీ కొత్త పాత్రలు వేస్తున్నాను. ఇదంతా నా కోసం పాత్రలు సృష్టిస్తున్న రచయితలు, నన్ను ప్రోత్సహిస్తున్న దర్శకులు, ఆదరిస్తున్న ప్రేక్షకుల వల్లే సాధ్యమవుతోంది’’ అన్నారు సీనియర్ నటుడు నరేష్. ప్రస్తుతం తెలుగు పరిశ్రమ కొత్త బాటలో వెళ్తోందని.. ఇలాంటి సమయంలో నటుడిగా తానూ మంచి చిత్రాల్లో భాగమవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గురువారం నరేష్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘నటుడిగా నా సినీ ప్రయాణం మొదలై 50ఏళ్లు పూర్తవుతోంది. నిజానికి ఇంతటి సుదీర్ఘ ప్రయాణం చాలా అరుదుగా ఉంటుంది. ఈ ప్రయాణంలో నాకెంతో అండగా నిలిచిన నా గురువు జంధ్యాల, కృష్ణ, విజయ నిర్మలగార్లను ఎప్పుడూ మర్చిపోను. సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వచ్చినప్పుడు.. నటుడు ఎస్వీ రంగారావునే స్ఫూర్తిగా తీసుకున్నా. యువ దర్శకులు కొత్త కాన్సెప్ట్లు, గెటప్లతో రావడం చాలా ఆనందంగా ఉంది’’.
* ‘‘అందరినీ కలుపుకొనిపోవడం, కలిసి పనిచేయడం, దర్శకులు చెప్పింది చేయడం.. వంటి వాటి వల్లే నటుడిగా నేనిప్పటికీ టాప్లోనే ఉన్నాను. రెమ్యునిరేషన్ గురించి ఎప్పుడూ ఆలోచించను. రాజకీయాల్లోకి వెళ్లిన పదేళ్లు నటుడిగా నన్ను నేను చాలా మిస్ అయ్యాను. ఆ సమయంలో ఒత్తిడికి లోనయ్యా. అప్పుడు నటుడిగా నేనేదైతే కోల్పోయానో.. ఇప్పుడది ఆస్వాదిస్తున్నాను. చాలా మంది నన్ను లక్కీ ఆర్టిస్ట్ అంటుంటారు. మంచి చిత్రాల్లో నన్ను తీసుకున్నందుకు నిజంగా లక్కీనే’’.
* ‘‘ఈ ఏడాది నా నుంచి మంచి చిత్రాలు రానున్నాయి. ప్రస్తుతం నాని ‘అంటే సుందరానికి’, సంతోష్ శోభన్ ‘అన్నీ మంచు శకునములే’, వరుణ్ తేజ్ ‘గని’ తదితర చిత్రాల్లో చేస్తున్నాను. అలాగే రామ్ చరణ్ - శంకర్ చిత్రంలోనూ, నవీన్ పొలిశెట్టి కొత్త సినిమాలోనూ నటిస్తున్నాను’’.
* ‘‘మా విజయ కృష్ణ మూవీస్ ప్రారంభించి 50ఏళ్లు పూర్తవుతోంది. ఇప్పుడు దాన్ని విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్గా మార్చాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం సినిమాలను నిర్మించాలనేది మా సంకల్పం. వినోదాత్మకంగా ఉండే మంచి చిత్రాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మళ్లీ విజయ కృష్ణ మూవీస్ పతాకాన్ని ఎగరవేయాలనుకుంటున్నాం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా