Govind Padmasoorya:దేనికైనా సిద్ధం
తెలుగు ప్రేక్షకుల పిలుపు ప్రత్యేకం అంటున్నారు నటుడు గోవింద్ పద్మసూర్య. పాత్రల పేర్లని గుర్తు పెట్టుకుని మరీ... ఆ పేర్లతోనే పిలుస్తుంటారని, ఇప్పుడు ఎక్కడి కెళ్లినా తనని ఆది అంటూ పలకరిస్తున్నారని తెలిపారు. మలయాళంలో కథానాయకుడైన గోవింద్ పద్మసూర్య తెలుగులో ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో పరిచయమయ్యారు.
తెలుగు ప్రేక్షకుల పిలుపు ప్రత్యేకం అంటున్నారు నటుడు గోవింద్ పద్మసూర్య. పాత్రల పేర్లని గుర్తు పెట్టుకుని మరీ... ఆ పేర్లతోనే పిలుస్తుంటారని, ఇప్పుడు ఎక్కడి కెళ్లినా తనని ఆది అంటూ పలకరిస్తున్నారని తెలిపారు. మలయాళంలో కథానాయకుడైన గోవింద్ పద్మసూర్య తెలుగులో ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో పరిచయమయ్యారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బంగార్రాజు’లో ఆది అనే ప్రతినాయకుడి పాత్రలో మెరిశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. పండగకొచ్చిన ‘బంగార్రాజు’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో తృప్తినిచ్చిందని, ప్రస్తుతం తాను తెలుగు నేర్చుకుంటున్నానని తెలిపారు. ‘‘మలయాళంలోనే నా సినీ ప్రయాణం మొదలైంది. హీరోగానే పరిచయమయ్యా. ఆ తర్వాత మమ్ముట్టి, సురేష్గోపి తదితర స్టార్స్తో కలిసి నటించా. తమిళంలో జీవా చేసిన ‘కీ’లో ప్రతినాయకుడిగా నటించా. ఆ సినిమా చూసే దర్శకుడు త్రివిక్రమ్ నాకు ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. నేను చూసిన తొలి తెలుగు చిత్రం ‘అతడు’. ఆ సినిమాని తెరకెక్కించిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే నేను తెలుగుకి పరిచయం కావడం థ్రిల్లింగ్గా అనిపించింది. అది తమిళం, మలయాళంలో విడుదల కావడంతో నాకు మంచి గుర్తింపు లభించింది. ‘బంగార్రాజు’లో నాగార్జునతో కలిసి తెరను పంచుకోవడం నా కెరీర్లో ఓ గొప్ప జ్ఞాపకం. ఆయనతో కలిసి నటించడం నాకొక గొప్ప పాఠం. ‘బంగార్రాజు’ కోసం చేసిన ప్రయాణంలో నాగచైతన్య, దర్శకుడు కల్యాణ్కృష్ణ నాకు మంచి మిత్రులయ్యారు. కృతిశెట్టిని చూసి నేను తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టా’’ అన్నారు. హీరో, విలన్, కామెడీ... ఎలాంటి పాత్రకైనా తనలోని నటుడు సిద్ధమే అన్నారు గోవింద్ పద్మసూర్య. నాని సోదరి దీప్తి దర్శకత్వం వహిస్తున్న ‘మీట్ అండ్ క్యూట్’లోనూ, త్వరలోనే మొదలు కానున్న మేర్లపాక గాంధీ సినిమాలోనూ నటిస్తున్నట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే