Malli Modalaindi: ఓటీటీలో ‘మళ్లీ మొదలైంది’

సుమంత్‌ హీరోగా టీజీ  కీర్తి కుమార్‌ తెరకెక్కించిన చిత్రం  ‘మళ్లీ మొదలైంది’. రాజశేఖర్‌ రెడ్డి నిర్మాత. వర్షిణీ సౌందర్‌ రాజన్‌, నైనా గంగూలి కథానాయికలు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’లో నేరుగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Updated : 22 Jan 2022 07:10 IST

సుమంత్‌ హీరోగా టీజీ  కీర్తి కుమార్‌ తెరకెక్కించిన చిత్రం  ‘మళ్లీ మొదలైంది’. రాజశేఖర్‌ రెడ్డి నిర్మాత. వర్షిణీ సౌందర్‌ రాజన్‌, నైనా గంగూలి కథానాయికలు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’లో నేరుగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘విడాకులు తీసుకున్న ఓ యువకుడు.. తన న్యాయవాదితో ప్రేమలో పడితే ఏం జరిగింది? అన్నదే ఈ చిత్ర కథాంశం. ఇందులో సుమంత్‌ భార్యగా వర్షిణీ కనిపించనుండగా.. న్యాయవాది పాత్రను నైనా గంగూలి పోషించింది. ఈ సినిమా ఫిబ్రవరిలో జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: శివ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని