Tollywood: తెర వారసత్వం
వారసత్వ నటులు చిత్ర పరిశ్రమకు కొత్తేమీకాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు నట వారసుల జోరు కనిపిస్తుంటుంది. ఏటా పదుల సంఖ్యలో కొత్త వారసులు వెండితెరకు పరిచయమవుతుంటారు. గతేడాది తెలుగులో వీరి సందడి బాగానే కనిపించింది.
2022లోనే అరంగేట్రం
వారసత్వ నటులు చిత్ర పరిశ్రమకు కొత్తేమీకాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు నట వారసుల జోరు కనిపిస్తుంటుంది. ఏటా పదుల సంఖ్యలో కొత్త వారసులు వెండితెరకు పరిచయమవుతుంటారు. గతేడాది తెలుగులో వీరి సందడి బాగానే కనిపించింది. మెగా కాంపౌండ్ నుంచి వైష్ణవ్ తేజ్, రాజశేఖర్ నట వారసురాలిగా శివానీ తెరపై మెరిసి మెప్పించారు. ఇప్పుడు వీరి బాటలోనే ఈ ఏడాదీ పలువురు నట వారసులు వెండితెరపై అదృష్టం పరీక్షించుకోనున్నారు. సంక్రాంతికి ఇద్దరు వారసులు రాగా... త్వరలో ప్రేక్షకుల్ని పలకరించడానికి మరికొందరు వస్తున్నారు. వారి చిత్ర విశేషాలేంటో చూసేద్దాం పదండి...
తెలుగు చిత్రసీమలో ఈ ఏడాది ఆరంభం నుంచే నట వారసుల సందడి కనిపించింది. సంక్రాంతికి మూడు సినిమాలు విడుదల కాగా.. అందులో రెండు వారసులకు సంబంధించినవే. వీటిలో ఒకటి ‘హీరో’. ఈ సినిమాతోనే సీనియర్ హీరో కృష్ణ మనవడు, మహేష్బాబు మేనల్లుడైన అశోక్ గల్లా కథానాయకుడిగా తెరకు పరిచయమయ్యారు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రమిది. కొత్తదనం నిండిన కమర్షియల్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా.. సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులకు వినోదాలు పంచిచ్చింది. ‘రౌడీబాయ్స్’ చిత్రంతో పెద్ద పండగ బరిలో సందడి చేసిన మరో కొత్త హీరో ఆశిష్. ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడాయన. శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కించిన చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. కాలేజీ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా.. పండగ బరిలో నిలిచి యువతరాన్ని అలరించింది. ప్రస్తుతం ఆశిష్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్లో చేయనున్నారు. సుక్కు శిష్యుడు కాశీ తెరకెక్కించనున్న ఈ సినిమాకి ‘సెల్ఫిష్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
వీళ్లూ ఉన్నారు...
దగ్గుబాటి కుటుంబం నుంచి ఈ ఏడాది మరో కొత్త హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. ఆయనే దగ్గుబాటి అభిరామ్. నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు రెండో తనయుడాయన. నటుడు రానాకు సోదరుడు. తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాతో.. ఈ ఏడాది తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టనున్నారు అభి. తేజ శైలిలో సాగే కొత్తదనం నిండిన కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కోసం ‘అహింస’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.
* ‘స్వాతిముత్యం’ సినిమాతో హీరోగా సినీప్రియుల్ని పలకరించనున్నారు బెల్లంకొండ గణేష్. నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో తనయుడాయన. లక్ష్మణ్ కె.కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో వెండితెరకు పరిచయమవుతున్నారు. టైటిల్కు తగ్గట్లుగానే స్వాతిముత్యం లాంటి ఓ యువకుడి కథగా ఈ సినిమా సాగనుంది. ఇందులో గణేష్కు జోడీగా వర్ష బొల్లమ్మ నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.
* ‘బేకర్ అండ్ బ్యూటీ’, ‘త్రీరోజెస్’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వంటి వెబ్సిరీస్లతో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరించారు సంగీత్ శోభన్. దర్శకుడు శోభన్ తనయుడు, హీరో సంతోష్ శోభన్ సోదరుడైన సంగీత్.. ఇప్పుడు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న సినిమాతో వెండితెరపై అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకుడెవరు? ఎప్పుడు సెట్స్పైకి వెళ్తుంది అన్నది తెలియాల్సి ఉంది.
అందరి చూపు.. అటు వైపే
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బాలయ్య మోక్షజ్ఞ తెరంగేట్రంపై ఎన్నోసార్లు స్పష్టత ఇచ్చారు. ఆయన త్వరలో తెరపైకి వస్తాడని చెబుతున్నారే తప్ప.. ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. ‘ఆదిత్య 999 మ్యాక్స్’తో చిత్రసీమకు పరిచయం చేస్తానని బాలకృష్ణ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది తన దర్శకత్వంలోనే రూపొందనున్నట్లు తెలిపారు. ‘ఆదిత్య 369’ సినిమాకి సీక్వెల్గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్నట్లు ప్రకటించారు బాలయ్య. కానీ, అదెప్పుడు సెట్స్పైకి వెళ్తుందన్నది ఆయన ఇప్పటికీ తేల్చి చెప్పలేదు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్పై సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్