Chiranjeevi: చిరంజీవికి పాజిటివ్‌

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి కరోనా బారిన పడ్డారు. పరీక్షలు చేయించుకోగా  పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో గడుపుతున్నానని బుధవారం ఆయన ట్విటర్‌ ద్వారా  తెలిపారు. కొన్నాళ్లుగా ఆయన ‘భోళాశంకర్‌’

Updated : 27 Jan 2022 07:09 IST

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి కరోనా బారిన పడ్డారు. పరీక్షలు చేయించుకోగా  పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో గడుపుతున్నానని బుధవారం ఆయన ట్విటర్‌ ద్వారా  తెలిపారు. కొన్నాళ్లుగా ఆయన ‘భోళాశంకర్‌’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘‘అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నా. కొన్ని రోజులు నుంచి నన్ను కలిసినవాళ్లంతా పరీక్షలు చేయించుకోవల్సిందిగా కోరుతున్నా. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తా’’ అని ట్వీట్‌ చేశారు చిరంజీవి. ‘‘చిరంజీవి త్వరగా కోలుకోవాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆకాంక్షించారు.

శ్రీకాంత్‌కూ: నటుడు శ్రీకాంత్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో, వైద్య పరీక్షలు చేయించుకొన్నానని అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆయన ట్విటర్‌   ద్వారా తెలిపారు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో గడుపుతున్నట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని