Ramcharan: కీర్తిసురేష్ నటనకి అభిమానినయ్యా!
‘‘కీర్తిసురేష్ ‘అజ్ఞాతవాసి’లోనే నాకు బాగా నచ్చింది. ‘మహానటి’ చూశాక ఆమె నటనకి అభిమానినయ్యా’’ అన్నారు ప్రముఖ కథా నాయకుడు రామ్చరణ్. బుధవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ‘గుడ్లక్ సఖి’ ముందస్తు విడుదల వేడుకకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కీర్తిసురేష్ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రమిది. ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్యభూమిక పోషించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్చంద్ర పదిరి నిర్మాత. శ్రావ్య వర్మ సహనిర్మాత. దిల్ రాజు
‘గుడ్లక్ సఖి’ వేడుకలో రామ్చరణ్
‘‘కీర్తిసురేష్ ‘అజ్ఞాతవాసి’లోనే నాకు బాగా నచ్చింది. ‘మహానటి’ చూశాక ఆమె నటనకి అభిమానినయ్యా’’ అన్నారు ప్రముఖ కథా నాయకుడు రామ్చరణ్. బుధవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ‘గుడ్లక్ సఖి’ ముందస్తు విడుదల వేడుకకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కీర్తిసురేష్ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రమిది. ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్యభూమిక పోషించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్చంద్ర పదిరి నిర్మాత. శ్రావ్య వర్మ సహనిర్మాత. దిల్ రాజు సమర్పకులు. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. బిగ్ టికెట్ని ఆవిష్కరించిన అనంతరం వేడుకని ఉద్దేశించి రామ్చరణ్ మాట్లాడారు. ‘‘నాన్న గారి సందేశాన్ని వినిపించడానికే నేను ఇక్కడికొచ్చా. నాన్న కోవిడ్తో ఈ వేడుకకి రాలేకపోయారు. అంతర్జాతీయ తరహా కథల్ని భారతీయ సినిమాల్లోకి తీసుకొచ్చిన ఘనత నగేష్ కుకునూర్ సొంతం. హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్... తదితర సినిమాలు చూసి ఎంతో స్ఫూర్తి పొందాను. ఆయనతో కలిసి ఈ వేదికని పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. కీర్తి ఇందులో చెప్పిన చిత్తూరు యాస చాలా బాగుంది. ఇలాంటి కథలు కీర్తి మరిన్ని చేయాలి’’ అన్నారు. కీర్తిసురేష్ మాట్లాడుతూ ‘‘మహానటి’ తర్వాత ఒప్పుకున్న సినిమా ఇది. సీరియస్ సినిమా తర్వాత, ఒక సరదా సినిమా చేయాలనుకున్నా. కథ వినగానే చేయడానికి ఒప్పుకున్నా. నాకు అంతగా నచ్చింది. నగేష్ కుకునూర్తో కలిసి పనిచేయడం ఓ గౌరవం. ఈ సినిమా ప్రయాణంలో చాలా నేర్చుకున్నా’’ అన్నారు. నగేష్ కుకునూర్ మాట్లాడుతూ ‘‘25 ఏళ్ల ముందు ‘హైదరాబాద్ బ్లూస్’ చేశా. మళ్లీ నేరుగా తెలుగు సినిమా చేయడానికి ఇన్నేళ్లు పట్టింది. నిజాయతీగా చెప్పాలంటే కీర్తిసురేష్ వల్లే ఈ సినిమా చేశా’’ అన్నారు. కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సానా, దిల్ రాజు, దేవిశ్రీ ప్రసాద్, అట్లూరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్