Tollywood: కాలంలో ప్రయాణం... వినోదాల విహారం
చిత్రసీమలో ఒక్కోసారి ఒక్కో తరహా కథల జోరు కనిపిస్తుంటుంది. ఒక క్రైమ్ థ్రిల్లర్ సత్తా చాటిందంటే చాలు.. వరుసగా అదే తరహా కథలు వెల్లువలా వచ్చేస్తాయి. ఓ హారర్ సినిమా హిట్టయితే చాలు.. అదే బాటలో మరికొన్ని హారర్ చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు వరుస కట్టేస్తాయి....
చిత్రసీమలో ఒక్కోసారి ఒక్కో తరహా కథల జోరు కనిపిస్తుంటుంది. ఒక క్రైమ్ థ్రిల్లర్ సత్తా చాటిందంటే చాలు.. వరుసగా అదే తరహా కథలు వెల్లువలా వచ్చేస్తాయి. ఓ హారర్ సినిమా హిట్టయితే చాలు.. అదే బాటలో మరికొన్ని హారర్ చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు వరుస కట్టేస్తాయి. ఇలా ఓ ట్రెండ్ను అనుసరిస్తూ ముందుకు సాగడం టాలీవుడ్కు అనాధిగా వస్తున్న ఆనవాయితీనే. ఇప్పుడు తెలుగులో టైమ్ ట్రావెల్ కథల హవా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు హీరోలు ఈ టైమ్ మెషిన్ కథలతో ప్రయాణాలు షురూ చేయగా.. ఇప్పుడు మరికొన్ని కథలు సెట్స్పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.
సినీప్రియులకు సరికొత్త అనుభూతిని పంచిచ్చేందుకు కొత్త దర్శకులు వైవిధ్యభరిత కథలతో ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే కాలాన్ని వెనక్కి తిప్పో.. లేదంటే భవిష్యత్తులోకి తీసుకెళ్లో కథలు చెప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఫలితంగా ఇప్పుడు తెలుగులో టైమ్ ట్రావెల్ కథల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్) కూడా ఈ తరహా కథాంశంతోనే రూపొందుతోంది. ‘మహానటి’ లాంటి భారీ విజయం తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాని ముస్తాబు చేస్తున్నట్లు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో సోషియో ఫాంటసీ అంశాలతో పాటు టైమ్ మిషన్ కాన్సెప్ట్ కూడా మిళితమై ఉంటుందని.. అందుకే ఈ స్క్రిప్ట్ విషయంలో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు సహాయం తీసుకుంటున్నట్లు తెలిసింది. కథానాయకుడు టైమ్ మిషన్ ఎక్కి భవిష్యత్తులోకి వెళ్లడమే ఈ చిత్ర కథా నేపథ్యమని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా.. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరిత కథలతో ప్రయాణం చేస్తుంటారు యువ హీరో శర్వానంద్. ఇప్పుడాయన కూడా ప్రభాస్ బాటలోనే టైమ్ మిషన్ ఎక్కేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా శ్రీకార్తిక్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ సినిమాలో చిత్రమైన టైమ్ ట్రావెల్ సెటప్ ఉందని సమాచారం. ఇందులో శర్వా, తన స్నేహితులతో కలిసి చిన్ననాటి రోజుల్లోకి వెళ్తాడని తెలుస్తోంది. అంటే బాల్యంలోకి వెళ్లి తన తల్లితో గడిపిన జ్ఞాపకాల్ని, స్కూల్ డేస్ని, అప్పటి స్నేహాల్ని దగ్గర్నుంచి చూసుకునే ప్రయత్నం చేస్తారట. ఇదే ఈ చిత్ర కథా నేపథ్యమని సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో చిత్ర కథా నేపథ్యంపై స్పష్టత ఇచ్చేసింది చిత్ర బృందం. మరి ఈ టైమ్ ట్రావెల్ తెరపై ఎలా కనువిందు చేయనుందో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. నందమూరి కల్యాణ్రామ్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘బింబిసార’. ఎ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్..అనేది ఉపశీర్షిక. వశిష్ట్ తెరకెక్కిస్తున్నారు. కేథరిన్, సంయుక్త మేనన్ కథానాయికలు. ఓ వైవిధ్యభరితమైన టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న బింబిసారుడి కాలానికి, వర్తమానానికి మధ్య సాగే కథగా ఉంటుంది. ఈ కథకు తగ్గట్లుగానే కల్యాణ్ రామ్ ఇందులో బింబిసారుడిగా.. మోడ్రన్ యువకుడిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని కథలు వస్తున్నాయి..
తమిళ హీరో సూర్య నటించిన ‘24’ టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొంది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిచ్చింది. దీనికి సీక్వెల్ తీసుకొచ్చే ఆలోచన ఉందని ఆ సినిమా విడుదల సమయంలోనే తెలిపారు విక్రమ్. ఇప్పుడా ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే ‘24’కి కొనసాగింపు కథను సిద్ధం చేశారని, ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశముందని తమిళ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ సినీ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన సినిమా ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ టైమ్ మెషిన్ సినిమా.. అప్పట్లో బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకొంది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు బాలకృష్ణ. ఇందుకోసం ఆయనే స్వయంగా కథ సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఈ చిత్రంతోనే తన తనయుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తానని బాలయ్య ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఎప్పుడు సెట్స్పైకి వెళ్తుందన్నది తెలియాల్సి ఉంది.
‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో సినీప్రియుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. ఇప్పుడాయన మైత్రీ మూవీస్ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నారు. ఇదొక ఆసక్తికర టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందనుందని సమాచారం. హీరో భూత, భవిష్యత్ కాలాలకు ఎలా వెళ్లాడు? అక్కడ ఏం చేశాడు? అనే నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కథ నాగచైతన్యకు వినిపించారని, అది ఆయనకు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ చేసేందుకు అంగీకారం తెలిపారని ప్రచారం వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు