Mohanbabu: దానివల్ల నష్టపోయింది నేనే!
‘‘జయాపజయాల్ని నేనెప్పుడూ పట్టించుకోను. సినిమా హిట్టయితే గొప్ప.. ప్లాపైతే అసమర్థత అనుకోకూడదు. మన ప్రయత్నంలో ఏమైనా లోపముందా? అని ఆలోచించుకోగలగాలి. ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోగలగాలి’’ అన్నారు నటుడు
‘‘జయాపజయాల్ని నేనెప్పుడూ పట్టించుకోను. సినిమా హిట్టయితే గొప్ప.. ప్లాపైతే అసమర్థత అనుకోకూడదు. మన ప్రయత్నంలో ఏమైనా లోపముందా? అని ఆలోచించుకోగలగాలి. ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోగలగాలి’’ అన్నారు నటుడు మోహన్బాబు. ప్రతినాయకుడిగా.. కథానాయకుడిగా ఎన్నో వైవిధ్య మైన పాత్రలతో సినీ ప్రియుల్ని మెప్పించిన నటుడాయన. ఇప్పుడాయన ‘సన్ ఆఫ్ ఇండియా’గా అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఆయన హీరోగా నటించడమే కాక.. స్వయంగా స్క్రీన్ప్లే అందించడం మరో విశేషం. డైమండ్ రత్నబాబు తెరకెక్కించారు. మంచు విష్ణు నిర్మించారు. ఈ సినిమా ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు మోహన్బాబు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలివి..
సందేశం.. వినోదాల మేళవింపుతో..
‘‘యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ సందేశాత్మక చిత్రమిది. ఇందులో నా పాత్ర చాలా శక్తిమంతంగా.. సరికొత్తగా ఉంటుంది. ‘చెడు వినకు.. చెడు చూడకు.. చెడు మాట్లాడకు’ అనే సిద్ధాంతాలకు తగ్గట్లుగా జీవనం సాగించే హీరో.. ఒక ఎమ్మెల్యే వల్ల చేయని తప్పునకు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే తన కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు. మరి జైలుకెళ్లిన హీరో ఆ తర్వాత ఏం చేశాడు? అవినీతి వ్యవస్థపై ఎలాంటి పోరాటం చేశాడు? అన్నది చిత్ర కథాంశం. ఇందులో సందేశంతో పాటు చక్కటి ఎంటర్టైన్మెంటూ ఉంది’’.
* ‘‘మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అస్సలు లేదు. ఈ జన్మకు వద్దనుకున్నా. చంద్రబాబు బంధువు. అప్పుడు అన్నగారితో సినిమా చేశాం. ప్రచారానికి పంపించారు. వెళ్లాం. ఇప్పుడు జగన్ బంధువు. చంద్రబాబుకు చేసినట్టు ఇక్కడా చేయాలి కదా. ప్రచారం చేశాం. అయిపోయింది. ఇప్పుడు సినిమాలు, యూనివర్సిటీ.. అని బోలెడు పనులున్నాయి’’.
ఓటీటీకి అనుకున్నాం..
‘‘రత్నబాబు కథ చెప్పినప్పుడే సినిమా కచ్చితంగా చేయాలనిపించింది. నిజానికి ఇందులో కొంత రిస్క్ ఉన్నా.. సాహసం చేయకపోతే ఎలా? అన్న ఉద్దేశంతో ముందడుగేశాం. వాస్తవానికి మేము దీన్ని ఓటీటీ కోసం అనుకున్నాం. దీని నిడివి గంటన్నరే. అందుకే కాస్త కుర్రకారు కోరుకునే అంశాల్ని జోడించాం. సినిమాని థియేటర్లోకి తీసుకురావాలనుకున్నాక.. కొన్ని సన్నివేశాలు తీసేశాం. మళ్లీ ఓటీటీలో విడుదల చేసేటప్పుడు వాటిని జోడించే అవకాశముంది. ఈ చిత్రంలో వినిపించిన 11వ శతాబ్దాం నాటి రఘువీర గద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి ఆ పాటను ప్రత్యేకంగా రూపొందించాం. ఈ గీతాన్ని పాడించడం కోసం తొలుత నలుగురైదుగురు గాయకుల్ని ప్రయత్నించాం. కానీ, ఈ పాటకు వాళ్లు సెట్ కాలేదు. తర్వాత నేను, ఇళయరాజా బాగా ఆలోచించి.. మలయాళ గాయకుడు రాహుల్ నంబియార్తో ఆ గద్యాన్ని పాడించాం’’.
రాజకీయాలంటే.. ‘ఛీ’ అంటున్నారు..
‘‘రాజకీయాలు ఒకప్పుడే బాగున్నాయి. ఇప్పటి రాజకీయాల్లో నీతి నిజాయితీలు, నైతిక విలువలు కనిపించడం లేదు. అందుకే అప్పట్లో రాజకీయాల్లో ఉంటే ‘చాలా గొప్ప వాడు’ అనేవారు. అదే ఇప్పుడు ఉంటే ‘ఛీ’ అంటున్నారు. అలాగని ఇప్పుడు మంచి నాయకులు లేరని కాదు. కొద్దిమంది ఉన్నారు. వాళ్లూ ఏమీ చేయలేని పరిస్థితులున్నాయి. ఇలాంటి అంశాలన్నీ ఈ చిత్రంలో చూపించాం. ‘ప్రైవేట్ జైళ్లు’ అనే ఓ ఆసక్తికరాంశాన్ని ఇందులో చర్చించాం’’.
* ‘‘దర్శకత్వం చేయాలన్న ఆలోచన ఉంది. రెండు స్క్రిప్ట్లు రెడీ చేసి పెట్టుకున్నాను. కాకపోతే రోజుకొకరిని కొడతానేమోనని భయం (నవ్వుతూ). ఎందుకంటే చెప్పిన టైమ్కు ఆర్టిస్ట్ సెట్స్లో ఉండకపోతే నాకు నచ్చదు. కోపం వచ్చేస్తుంది. చిన్నతనంలో ఆకలి మంటల్లో నుంచి పుట్టిన కోపమది. అది అప్పటి నుంచి నాతోనే ఉండిపోయింది. నేను జీవితంలో బానిసైంది ఆ కోపానికే. దానివల్ల నష్టపోయింది నేనే’’.
* ‘‘ప్రస్తుతం నేను నా జీవిత కథ రాసే పనిలో ఉన్నా. అందులో నిజాలు రాస్తున్నాను. ఇప్పటికే కొంత వరకు రాసి.. ఆపాను. దానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. దీన్ని తెరపైకి తీసుకురావాలా? తీసుకొస్తే ఎవరితో చేయాలి? అన్నది నేనేమీ ఆలోచించలేదు’’.
దాన్ని తప్పు పడితే ఎలా?
‘‘టికెట్ రేట్లపై నేనిప్పటికే మాట్లాడాను. దానిపై మళ్లీ మాట్లాడదలచుకోలేదు. ప్రతి పార్టీలోనూ నాకు స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు. పేర్ని నాని ఒక పెళ్లికి వస్తే.. ‘బ్రదర్, మా ఇంటికి బ్రేక్ ఫాస్ట్కి వస్తారా?’ అని అడిగా. అందులో తప్పేముంది. దాన్ని తప్పు పడితే ఎలా? సరదాగా మేం ఎప్పుడు కలిశాం, ఎవరితో కలిశామన్నది మాట్లాడుకున్నాం. అంతే! ‘జగన్ ఏం మాట్లాడారు? మా సినిమా వాళ్లు ఏం మాట్లాడారు? ఆ విషయాలన్నీ నాకు చెప్పండి!’ అని ఎందుకు అడుగుతా. ఇంటికి పిలిచిన అతిథిని గౌరవించాం. దాని గురించి రకరకాలుగా రాశారు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా