Nadigar Sangam: మళ్లీ పాండవులు గెలిచారు
ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు రెండేళ్ల తర్వాత జరిగినా అనుకున్నట్లుగానే నడిగర్ సంఘం ఎన్నికల్లో నటుడు విశాల్ జట్టు (పాండవర్ అని)
భారీ విజయాన్ని దక్కించుకున్న విశాల్ జట్టు
కౌంటింగ్ మధ్యలో వాకౌట్ చేసిన భాగ్యరాజ్ టీం
కోడంబాక్కం, న్యూస్టుడే: ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు రెండేళ్ల తర్వాత జరిగినా అనుకున్నట్లుగానే నడిగర్ సంఘం ఎన్నికల్లో నటుడు విశాల్ జట్టు (పాండవర్ అని) విజయం సాధించింది. వారికిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. మరోవైపు ఈ లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కౌంటింగ్ నుంచి భాగ్యరాజ్ జట్టు వాకౌట్ చేసింది. 2019, జూన్ 23న దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు జరిగాయి. సీనియర్ దర్శక నటుడు భాగ్యరాజ్ సారధ్యంలో ‘స్వామి శంకరదాస్’ జట్టు, నాజర్-విశాల్ సారధ్యంలో ‘పాండవర్ అని’.. జట్లు పోటీ చేశాయి. కొన్ని కారణాల వలన, ఎన్నికలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కారణంగా.. అసలు ఈ ఎన్నికలు చెల్లవని, కౌంటింగ్ ప్రక్రియను నిషేధించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పోలింగ్ బాక్సులను నుంగంబాక్కంలోని సౌత్ ఇండియన్ బ్యాంక్లో భద్రపరిచారు. ఇదిలా ఉండగా ఎన్నికలు చెల్లవని ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ విశాల్- నాజర్ జట్టు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీంతో ఇటీవల ఈ కేసు విచారణకు రాగా, ఎన్నికలు చెల్లుతాయని, కౌంటింగ్ ప్రక్రియ జరపవచ్చని న్యాయస్థానం ఆదేశించింది. అయితే తీర్పును సవాలుచేస్తూ ఏళుమలై అనే సహాయ నటుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
ఆనాటి ఉత్సాహంతో..
న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నుంగంబాక్కంలోని గుడ్ షెపర్డ్ పాఠశాలలో జరిగింది. దాదాపు రెండేళ్ల క్రితం నాటి ఎన్నికలే అయినా.. ఇరు జట్లు అనాటి ఉత్సాహంతో కౌంటింగ్ ప్రాంగణానికి చేరుకున్నాయి. ఎన్నికల అధికారి, నటీనటుల సంఘం ప్రత్యేక అధికారుల సమక్షంలో కౌంటింగ్ చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో విశాల్ జట్టు (పాండవర్ అని) విజయం సాధించింది. అధ్యక్ష పదవికి పోటీ చేసిన నాజర్ ఘన విజయం సాధించారు. ఆయనకు 1,701 ఓట్లు లభించగా, భాగ్యరాజ్కు 1054 ఓట్లు దక్కాయి. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన విశాల్ 1720 ఓట్లు సొంతం చేసుకోగా, ఐసరి గణేశ్కు 1,032 ఓట్లు పడ్డాయి. దీంతో విశాల్ మళ్లీ విజయం సాధించారు. కోశాధికారి పదవికి పోటీ చేసిన కార్తికి 1827, ప్రశాంత్కు 919 ఓట్లు వచ్చాయి. 908 ఓట్ల వ్యత్యాసంతో కార్తి గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేసిన కరుణాస్కు 1,605 (పాండవర్ అని), కుట్టి పద్మినికి 1,015 (శంకరదాస్ జట్టు), పూచ్చి మురుగన్ 1,612 (పాండవర్ అని), ఉదయకు 973 (శంకరదాస్ జట్టు) ఓట్లు దక్కాయి. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లోనూ పాండవర్ అని విజయం సాధించింది. అంటే వరుసగా రెండు సార్లు గెలుపు గుర్రాలై నిలిచారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్ల పాటు వీళ్లు పదవిలో కొనసాగుతారు.
భవనం పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యం
‘‘2015 నుంచి 2019 వరకు ‘నడిగర్ సంఘం’ చరిత్రలో కీలకమైన రోజులు. సభ్యులకు దక్కిన సంక్షేమ పథకాలు, దాదాపు 70శాతం పూర్తయిన సంఘం భవన నిర్మాణ పనులు.. వంటి విషయాలు మా జట్టుకు దక్కిన గౌరవ ప్రతీకలు. కానీ రెండేళ్ల పాటు ఆ పనులు ఆగిపోయాయి. మేం చాలా బాధపడ్డాం. దాదాపు రెండేళ్ల తర్వాత న్యాయపోరాటంతో తిరిగి విజయం దక్కింది. ఇది అసాధారణమైన విజయం! ఆ భవనాన్ని పూర్తి చేస్తాం. తద్వారా వచ్చే ఆదాయం తదుపరి తరానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.’’- నటుడు కార్తి (కోశాధికారిగా గెలిచిన అభ్యర్థి)
లెక్కింపుపై అసంతృప్తి
కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్న భాగ్యరాజ్, ఆయన జట్టులోని ఐసరి గణేశ్లు ప్రారంభం నుంచే తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. నమోదైన ఓట్లకన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. దీంతో కాసేపు ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. మళ్లీ కౌంటింగ్ మొదలవడంతో భాగ్యరాజ్ జట్టు సభ్యులు అక్కడి నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా భాగ్యరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలైన ఓట్ల కన్నా 100 ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
మోహన్లాల్ డ్యాన్స్ను షారుక్ ఖాన్ మెచ్చుకున్నారు. షారుక్పై మోహన్లాల్ ప్రశంసలు కురిపించారు. -
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
పవన్కల్యాణ్ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా? -
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. -
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం