‘రణస్థలి’లో గెలుపెవరిది?

పరశురాం శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణస్థలి’. ఏజే ప్రొడక్షన్స్‌ పతాకంపై సూరెడ్డి విష్ణు సమర్పిస్తున్నారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన

Published : 26 Apr 2022 04:25 IST

రశురాం శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణస్థలి’. ఏజే ప్రొడక్షన్స్‌ పతాకంపై సూరెడ్డి విష్ణు సమర్పిస్తున్నారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఈ సినిమా టీజర్‌ని కూడా చూశా. దర్శకుడు పరశురాం శ్రీనివాస్‌ యాక్షన్‌ సన్నివేశాన్ని తీసిన విధానం చాలా బాగుంది. చిన్న చిత్రంలో ఇలాంటి ప్రయత్నం చేయడం గొప్ప విషయం. ‘కేజీఎఫ్‌2’ని గుర్తు చేసిందీ టీజర్‌. చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. రణస్థలిలో గెలుపు ఎవరి సొంతమైందనేది తెరపైనే చూడాలన్నారు. కార్యక్రమంలో నటులు ధర్మ, ప్రశాంత్‌, శివ, నాగేంద్రలతోపాటు, ఛాయాగ్రాహకుడు జాస్తి బాలాజీ, ఎడిటర్‌ భువన్‌, సాయి, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని