ఆట మొదలెట్టిన జాన్వీ
హారర్ కామెడీ సినిమా ‘రూహీ’తో అలరించిన జంట రాజ్కుమార్ రావ్, జాన్వీ కపూర్. వీరిద్దరి కలయికలో మరో చిత్రం రానున్న విషయం తెలిసిందే. అదే ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహీ’. ఇందులో జాన్వీ, రాజ్కుమార్లు మహిమ, మహేంద్ర అనే పాత్రల్లో కనిపిస్తారు.
హారర్ కామెడీ సినిమా ‘రూహీ’తో అలరించిన జంట రాజ్కుమార్ రావ్, జాన్వీ కపూర్. వీరిద్దరి కలయికలో మరో చిత్రం రానున్న విషయం తెలిసిందే. అదే ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహీ’. ఇందులో జాన్వీ, రాజ్కుమార్లు మహిమ, మహేంద్ర అనే పాత్రల్లో కనిపిస్తారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సోమవారం నుంచి మొదలయింది. శరణ్శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం క్రికెట్ నేపథ్యంగా సాగుతుంది. దీని కోసం జాన్వీ కపూర్ భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ సాయంతో ఆటకు సంబంధించిన మెలకువలను సైతం నేర్చుకోవడం విశేషం. చిత్రీకరణను వేగంగా ముగించి ఈ ఏడాది అక్టోబరు 7న ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్రబృందం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.