Cinema News: యువ నాయిక.. పాన్ ఇండియా ప్రేమిక
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్. అగ్ర కథానాయకుల నుంచి.. కుర్ర హీరోల వరకు అందరూ ఇదే పంథాలో నడుస్తున్నారు. మంచి కథ కుదిరిందంటే చాలు.. హిందీ సహా నాలుగైదు భాషల్లో విడుదల చేసి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడీ ఫీవర్...
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్. అగ్ర కథానాయకుల నుంచి.. కుర్ర హీరోల వరకు అందరూ ఇదే పంథాలో నడుస్తున్నారు. మంచి కథ కుదిరిందంటే చాలు.. హిందీ సహా నాలుగైదు భాషల్లో విడుదల చేసి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడీ ఫీవర్ కథానాయికల్ని పట్టుకుంది. అనుష్క, సమంత, కీర్తి సురేష్ వంటి అగ్ర కథానాయికలంతా ఇప్పటికే పాన్ ఇండియా కథలతో అదృష్టం పరీక్షించుకున్నారు. ఇప్పుడీ రేసులోకి కొత్తతరం నాయికలు వచ్చి చేరుతున్నారు. మెరుపులు మెరిపించేందుకు సెట్స్పై చకచకా ముస్తాబవుతున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా కథలకు చిరునామాగా నిలుస్తున్న కథానాయిక సమంత. ‘ది ఫ్యామిలీమెన్ 2’ సిరీస్తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆమె.. ప్రస్తుతం రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్లతో బిజీ బిజీగా గడిపేస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతుండగా.. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ‘యశోద’ తుది దశ చిత్రీకరణలో ఉంది. కెరీర్ ఆరంభం నుంచీ నటనా ప్రాధాన్యమున్న పాత్రలతోనే అలరిస్తూ వస్తోంది నటి సాయి పల్లవి. కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే ఈ అమ్మడు.. ఇప్పుడు ఓ బహు భాషా చిత్రానికి పచ్చజెండా ఊపింది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘గార్గి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇటీవలే సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర గ్లింప్స్ను విడుదల చేశారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తొలి అడుగులోనే..
‘అందాల రాక్షసి’గా వెండితెరపై మెరిసిన సుందరి లావణ్య త్రిపాఠి. ఇన్నాళ్లు గ్లామర్ నాయికగా తెరపై జోరు చూపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు పంథా మార్చింది. నాయికా ప్రాధాన్య కథలతో సత్తా చాటేందుకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంగా ‘హ్యాపీ బర్త్డే’ అంటూ నేరుగా పాన్ ఇండియా మార్కెట్కు నిచ్చెన వేసింది. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా తెరకెక్కిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్ ప్రాధాన్యమున్న క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం.. ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. దీన్ని పాన్ ఇండియా సినిమాగా జులై 15న ఒకేసారి పలు భాషల్లో విడుదల చేయనున్నారు.
శ్రద్ధా.. పాన్ ఇండియా ‘విట్నెస్’
‘జెర్సీ’ సినిమాతో సారాగా అందరి మదిలో గుర్తుండిపోయిన నాయిక శ్రద్ధా శ్రీనాథ్. ఓవైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే.. మరోవైపు నాయిక ప్రాధాన్య కథలతోనూ మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడామె నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘విట్నెస్’. దీపక్ దర్శకుడు. రోహిణి మరో కీలక పాత్రలో నటిస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. బలమైన భావోద్వేగాలకు ఆస్కారముంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీన్ని త్వరలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.
‘డ్రైవర్ జమున’గా..
ఐశ్వర్య విభిన్నమైన నటనా ప్రాధాన్య పాత్రలు ఎంచుకుంటూ.. ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ వరుస విజయాలు అందుకుంటోన్న కథానాయిక ఐశ్వర్య రాజేశ్. ప్రస్తుతం నాయికా ప్రాధాన్య సినిమాలతో జోరు చూపిస్తోన్న ఈ తెలుగందం.. ఇప్పుడు ‘డ్రైవర్ జమున’గా పాన్ ఇండియా స్థాయిలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఓ లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో జరిగిన నాటకీయ సంఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. పూర్తి రోడ్ జర్నీ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి పా.కిన్ల్సిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!