ఈ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం
మహేష్బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కీర్తి సురేష్ కథానాయిక. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం ‘మ మ మాస్ సెలబ్రేషన్స్’ పేరుతో కర్నూలులో ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్బాబు మాట్లాడుతూ..
మహేష్ బాబు
మహేష్బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కీర్తి సురేష్ కథానాయిక. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం ‘మ మ మాస్ సెలబ్రేషన్స్’ పేరుతో కర్నూలులో ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్బాబు మాట్లాడుతూ.. ‘‘ఇదేదో సక్సెస్ మీట్లా లేదు. వంద రోజుల వేడుకలా ఉంది. నాన్న సర్కారు వారి పాట చూసి ‘దూకుడు’, ‘పోకిరి’ కన్నా పెద్ద హిట్టవుతుందని చెప్పారు. ఆ మాటలే నిజమయ్యాయి. కీర్తి సురేష్, సముద్రఖని సినిమాలో చాలా బాగా చేశారు. తమన్ ఇచ్చిన ‘కళావతి..’ ఇవాళ ఒక ఆంథమ్లా తయారైంది. థ్యాంక్స్ తమన్. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం. కొవిడ్ పరిస్థితుల్ని దాటుకొని మీ ముందుకొచ్చాం. మీరంతా మాకు మర్చిపోలేని విజయమిచ్చారు. ఈ విజయాన్ని మేమెప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. నేను ‘శ్రీమంతుడు’ లాంటి హిట్ ఇచ్చానని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు అంటుంటారు. ఈరోజున వాళ్లు నాకు ‘సర్కారు వారి పాట’ అనే హిట్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ఉన్న ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగ్.. అన్నీ మహేష్పై నాకున్న ప్రేమే. ఆయనకు అద్భుతమైన చిత్రమిస్తానని నేను మాటిచ్చాను. ఈ సినిమాతో అది పూర్తి చేశాను. దీన్ని గుండెల్లో పెట్టుకుని బ్లాక్బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు పరశురామ్. తమన్ మాట్లాడుతూ.. ‘‘మహేష్ కనిపించడానికే క్లాస్. ఆయన సినిమాలకి వచ్చే కలెక్షన్లు మాస్. అనంత్ శ్రీరామ్ పెన్నంతే ఉంటాడు. కానీ, ఆయన సిరా అసలు ఆరిపోదు. ఈ సినిమా మాకు చాలా పెద్ద బాధ్యత. దాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ చిత్ర మ్యూజిక్ క్రెడిట్ అంతా బుజ్జీదే. తనకి మహేష్పై ఉన్న అభిమానాన్ని ఈ చిత్ర పాటల్లో చూపించాడు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అనంత శ్రీరామ్, నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కిలారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..