Sobhita Dhulipala: బాధ్యతతో చేశా
‘‘నా కెరీర్లో నేనింత వరకు కన్నీళ్ల కోసం గ్లిజరిన్ వాడింది లేదు. ‘మేజర్’ కథని అనుభవించిన తర్వాత జీవితంలో నాకెప్పటికీ గ్లిజరిన్ అవసరం ఉండదనిపించింది’’ అంది నటి శోభితా ధూళిపాళ. ‘గూఢచారి’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ తెలుగందం.. ఇప్పుడు ‘మేజర్’లో కీలక పాత్ర పోషించింది.
‘‘నా కెరీర్లో నేనింత వరకు కన్నీళ్ల కోసం గ్లిజరిన్ వాడింది లేదు. ‘మేజర్’ కథని అనుభవించిన తర్వాత జీవితంలో నాకెప్పటికీ గ్లిజరిన్ అవసరం ఉండదనిపించింది’’ అంది నటి శోభితా ధూళిపాళ. ‘గూఢచారి’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ తెలుగందం.. ఇప్పుడు ‘మేజర్’లో కీలక పాత్ర పోషించింది. అడివి శేష్ టైటిల్ పాత్ర పోషించారు. జూన్ 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది నటి శోభితా. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..
‘‘గూఢచారి’ చేస్తున్నప్పుడే అడివి శేష్కు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పట్ల ఉన్న ఆరాధనా భావాన్ని గమనించాను. ఆయన అంతకు ముందు నుంచే సందీప్ జీవితంపై పరిశోధన చేస్తున్నారు. ఆసక్తికరమైన సంగతుల్ని శేష్ నాకు చెప్పేవారు. ఆయన ఈ చిత్రం చేస్తారని, దీంట్లో నేను చేస్తానని నాకు తెలియదు. ఒక విధంగా ఈ కథకు నేనే తొలి ఆడియన్’’.
బోలెడు కోణాలున్న పాత్ర..
‘‘ఈ సినిమాలో ఒక పక్క సందీప్ జీవితాన్ని, మరోపక్క 26/11 తాజ్ ఉగ్రదాడుల్ని సమాంతరంగా చూపిస్తారు. నేను ఆ దాడుల్లో ఓ బందీగా కనిపిస్తా. నా పాత్ర పేరు ప్రమోద. భావోద్వేగాలతో నిండిన బరువైన పాత్రిది. నిజ జీవితంలో ఒక వ్యక్తి ఈ దాడుల్ని, బాధని ఎదుర్కొన్నారు. అందుకే దీన్ని సినిమాటిక్గా కాకుండా మనసు పెట్టి ఒక బాధ్యతతో చేశా. కచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది’’.
సందీప్ జీవన ప్రయాణం..
‘‘ఆర్మీ కథలు ఒక యుద్ధం లేదా ఒక సంఘటన మీద ఆధారపడి ఉంటాయి. ఇది అలాంటి చిత్రం కాదు. మేజర్ సందీప్ ఎలా జీవించారు? దేశం కోసం ఎంత ధైర్యంగా నిలబడ్డారు? అన్నది ఈ చిత్రంలో చూస్తారు. సందీప్ జీవితంలో సినిమాకి కావాల్సిన బోలెడన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎంత కష్టం వచ్చినా సరే.. ధైర్యమైన మార్గాన్నే ఎంచుకోవాలని, అలా ఎంచుకునే సామర్థ్యం అందరిలో ఉందనే విషయాన్ని గుర్తుచేసే సినిమా ‘మేజర్’’.
వాళ్లు గర్వపడాలనే!
‘‘ఈ సినిమా కోసం అడివి శేష్ చాలా కష్టపడ్డాడు. ఈ కథ మేజర్ సందీప్ తల్లిదండ్రులకు చాలా సున్నితమైన అంశం. వారు ఈ చిత్రం చూసి గర్వపడాలనే ఉద్దేశంతో శేష్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా చూశాక సందీప్ తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారోనని నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మహేష్బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం మాకు గొప్ప ఎనర్జీని ఇచ్చింది.\
తెలుగులో ఎక్కువగా చేయాలి..
‘‘నేను బయట అన్ని భాషల్లోనూ బాగానే సినిమాలు చేస్తున్నా. తెలుగులోనే సరిగ్గా కుదరడం లేదు. రానున్న రోజుల్లో ఇక్కడా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. నాకు చారిత్రక కథల్లో నటించాలని కోరిక ఉండేది. ‘పొన్నియన్ సెల్వన్’తో అది నెరవేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాక్సాఫీస్ బరిలో అదిరే ఆట వసూళ్ల వేట
క్రీడా నేపథ్య కథలపై ప్రేక్షకులతో పాటు సినీతారలు మక్కువ కనబరుస్తుంటారు. ఆట.. అందులోని సవాళ్లు.. గెలుపు కోసం చేసే సాహసోపేతమైన ప్రయాణం.. -
గోవాకు దేవర
‘దేవర’ను పూర్తి చేయడమే లక్ష్యంగా వడివడిగా అడుగులేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
నిద్ర కోసం ఆరాటపడిన రోజులున్నాయి
‘సరదాగా తీసుకునే చిన్న చిన్న విరామాలు నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి, చిత్రాల ఎంపిక విషయంలో ఎంతో దోహదపడతాయని నా అభిప్రాయం’ అంటోంది మృణాల్ ఠాకూర్. చేతి నిండా సినిమాలు... -
ప్రేక్షకుల్లో గమనించిన మార్పు అదే!
‘‘కొత్త కథలతో సినిమాలు చేయాలన్నదే నా ప్రయత్నం. పంపిణీదారుడిగా ఉన్నప్పుడు నా అభిరుచుల్ని కథానాయకులు నమ్మారు. వాళ్ల ప్రోత్సాహంతోనే నిర్మాతగా ప్రయాణం చేస్తున్నా’’ అన్నారు రాజేశ్ దండా. -
చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా
చిత్రసీమలో ఉత్తేజాన్ని, సినీ ఔత్సాహికుల్లో స్ఫూర్తిని నింపేలా సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ని నిర్వహిస్తున్నట్టు ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ప్రకటించాయి. -
‘మగధీర’, ‘ప్రేమికుడు’ మళ్లీ..
రామ్చరణ్ కథానాయకుడిగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’తోపాటు, ప్రభుదేవా కథానాయకుడిగా మరో అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘ప్రేమికుడు’ రీరిలీజ్గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. -
ప్రతినాయకుడిగా శివాజీ
‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు కొండా విజయ్ కుమార్. ఇప్పుడాయన ‘అహం’ పేరుతో ఓ చిత్రం చేస్తున్నారు. -
మోహన్లాల్ @ 360
‘మలైకోటై వాలిబన్’ చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నారు మలయాళ అగ్రకథానాయకుడు మోహన్లాల్. ప్రస్తుతం ఆయన.. మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. -
యమధీర రాజకీయం
కన్నడ తార కోమల్ కుమార్ కథానాయకుడిగా... శంకర్.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన అనువాద చిత్రం ‘యమధీర’. రిషిక శర్మ కథానాయిక. క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యభూమిక పోషించారు. -
రాజమండ్రిలో భీమునిపట్నం
కంచర్ల ఉపేంద్ర, అపర్ణాదేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘1920 భీమునిపట్నం’. నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్నారు. -
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్తో ప్రగ్యా.. బ్రదర్కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?
‘కాంతార 2’ హీరోయిన్పై చిత్ర పరిశ్రమలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే?
తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు