Vishal: ‘లాఠీ’ ఝులిపించేది ఆరోజే

విశాల్‌ హీరోగా ఎ.వినోద్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ చిత్రం ‘లాఠీ’. రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునైనా కథా  నాయిక. ఈ సినిమా ఆగస్ట్‌ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆదివారం

Updated : 23 May 2022 06:48 IST

విశాల్‌ హీరోగా ఎ.వినోద్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ చిత్రం ‘లాఠీ’. రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునైనా కథా  నాయిక. ఈ సినిమా ఆగస్ట్‌ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా   విడుదల తేదీతో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో విశాల్‌ ఒంటినిండా గాయాలతో  కనిపించారు. ఓవైపు ముఖమంతా నెత్తుటితో తడిసి ముద్దవుతున్నా.. ఆయన చిరునవ్వులు చిందిస్తూ కనిపించడం ఆసక్తిరేకెత్తిస్తోంది. ‘‘సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి ఉంది. మరి ఆ లాఠీతో విశాల్‌ ఎలాంటి మార్పులకు నాంది పలికారన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. యాక్షన్‌కు ప్రాధాన్యమున్న చిత్రమిది. ద్వితీయార్ధంలో ఉండే 45నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చిత్రం తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. దీనికి సామ్‌ సిఎస్‌ స్వరాలందిస్తున్నారు. బాలసుబ్రమణ్యన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని