Anil ravipudi: ‘ఎఫ్4’ లో మూడో హీరో వస్తాడు!
‘‘నిర్మాణ వ్యయం ఎక్కువే అయినా.. ఇంటిల్లిపాదీ కలిసి చూడాల్సిన చిత్రం ఎఫ్3. అందుకే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు విక్రయించేలా నిర్మాత దిల్రాజు నిర్ణయం తీసుకున్నారు. కచ్చితంగా ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ థియేటర్కి తీసుకొస్తుందీ చిత్రం. ‘ఎఫ్2’ని మించిన వినోదాన్ని ఇందులో ఆస్వాదిస్తార’’ని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ‘ఎఫ్2’తో వెంకటేష్,
‘‘నిర్మాణ వ్యయం ఎక్కువే అయినా.. ఇంటిల్లిపాదీ కలిసి చూడాల్సిన చిత్రం ఎఫ్3. అందుకే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు విక్రయించేలా నిర్మాత దిల్రాజు నిర్ణయం తీసుకున్నారు. కచ్చితంగా ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ థియేటర్కి తీసుకొస్తుందీ చిత్రం. ‘ఎఫ్2’ని మించిన వినోదాన్ని ఇందులో ఆస్వాదిస్తార’’ని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ‘ఎఫ్2’తో వెంకటేష్, వరుణ్తేజ్లని కో బ్రదర్స్గా చూపించి నవ్వించారు. మరోసారి అవే పాత్రలతో ‘ఎఫ్3’ని తీశారు. తెలుగులో వస్తున్న ఫ్రాంచైజీ చిత్రమిది. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు కొత్త. ‘ఎఫ్3’ తీయాలనుకున్నప్పుడు మీ మనసులో మెదిలిన ఆలోచనలేమిటి?
కామెడీ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు. నవ్వించిన సినిమాలు తిరస్కారానికి గురైన దాఖలాలే లేవు. వాళ్లకి వినోదం పంచితే చాలు. తెలుగులో ఫ్రాంచైజీ కొత్తే కానీ... బాలీవుడ్లో ‘గోల్మాల్’ సినిమాల తరహాలో మనకీ నవ్వుకోవడానికి ఓ సిరీస్ ఉండాలని చేస్తున్న ప్రయత్నమే ఈ సినిమాలు. కథపరంగా ‘ఎఫ్2’ కంటే ఎక్కువగా కసరత్తులు చేశాం.
‘ఎఫ్2’ కథని కాకుండా... ఆ ప్రాతల్ని మాత్రమే తీసుకోవడానికి కారణమేమిటి?
కొత్త కథని చెప్పాలనుకున్నాం. ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిన అంశాలతోనే ఆ కథ సాగుతుంది. ‘ఎఫ్2’లో భార్యాభర్తల మధ్య ఫన్, ఫ్రస్ట్రేషన్ అయితే... ఇందులో డబ్బు గురించి వచ్చే ఫ్రస్ట్రేషన్. ఇది ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అంశం. డబ్బు చుట్టూ ఉండే ఆశ, అత్యాశ, కుట్ర, మోసం ఇవన్నీ చాలా బాగా పండాయి. తొలి సినిమా విజయవంతం కావడంతో ఇందులో మరింత ఉత్సాహంగా నటించారు. సునీల్, మురళీశర్మ, అలీ...ఇలా కొత్తమంది కొత్తనటులూ తోడయ్యారు. ఎక్కువ గ్లామర్తోపాటు, ఎక్కువ వినోదంతో సాగుతుందీ చిత్రం. ప్రతి పాత్ర కూడా అత్యాశతో కనిపిస్తుంది. ఎంత ఫన్ ఉంటుందో, అంత కథ ఉంటుంది. డబ్బు గురించి ఇందులో చెప్పిన నిజాలు ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతాయి.
‘ఎఫ్3’ అనగానే మరో హీరో కూడా కనిపిస్తారేమో అని ఆశించారంతా. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు మూడో హీరో ఆలోచన ఉందా?
ఆ ఆలోచన కూడా వచ్చింది. అయితే అది అప్పుడే వాడేస్తే తర్వాత సినిమాలకి ఏమీ ఉండదనిపించింది. అందుకే ఆ ఆలోచనని పక్కనపెట్టి ‘ఎఫ్2’ తారలతోనే వీలైనంత వినోదాన్ని సృష్టించాం. ‘ఎఫ్4’లో కానీ, ఆ తర్వాత సినిమాల్లో కానీ మూడో హీరో తప్పకుండా వస్తాడు. అయితే ‘ఎఫ్2’లో ఉన్న పాత్రలకీ, ఇందులో పాత్రలకీ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. తొలి సినిమాలో వెంకటేష్కి కుటుంబం అంటూ లేదు. ఇందులో ఉంటుంది. వరుణ్కి అక్కడ కుటుంబం ఉంటుంది, కానీ ఇందులో ఉండదు. కరోనా రెండో దశ తర్వాత కథానాయిక పూజా హెగ్డేతో ఓ పాట చేయించాలని నిర్ణయించాం. కథలోకి పూజాహెగ్డేలానే వచ్చి సెలబ్రేషన్స్ పాటలో ఆడిపాడుతుందామె.
అంత మంది నటులతో కలిసి పనిచేయడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
మా సెట్లో కారవాన్లన్నీ చూస్తే మినీ మియాపూర్ బస్ డిపోలా ఉండేది. అంతమంది నటులు రోజూ సెట్కి వచ్చేవాళ్లు. ఎవరు ముందు వస్తే వాళ్ల సన్నివేశాల్ని తీసి పంపించడమే. అన్నపూర్ణమ్మ, వై.విజయ టైమ్ అంటే టైమే. వాళ్లు ఉదయం 8 గంటలకే వచ్చేవాళ్లు. అలాంటి క్రమశిక్షణ కలిగిన నటుల్ని నేను చూడలేదు. కరోనా సమయంలో వాళ్ల విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకున్నాం. సునీల్ అంటే నాకు ప్రత్యేక అభిమానం. పదేళ్ల తర్వాత ఆయన కడుపుబ్బా నవ్వించే మరో మంచి పాత్ర చేశారు. అలీ సైతం అద్భుతమైన పాత్రలో కనిపిస్తారు. దేవిశ్రీప్రసాద్తో ఇది నాకు మూడో సినిమా. పాటల ఆల్బమ్తోపాటు, నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంటుంది. దిల్రాజుతో సినిమా అంటే సొంత సంస్థలో సినిమా అన్నట్టే ఉంటుంది. అందుకే ఆయనతో నా ప్రయాణం అలా కొనసాగుతూనే ఉంది.
బాలకృష్ణతో సినిమా ఎలా ఉంటుంది? ఎప్పుడు మొదలవుతుంది?
సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సెట్స్పైకి వెళతాం. బాలకృష్ణ ఎంత శక్తివంతంగా కనిపిస్తారో, అందుకు తగ్గట్టే సినిమా ఉంటుంది. మేమిద్దరం కలిసి ఓ కొత్త రకమైన కథని చేస్తాం.
చాలా మంది నటులుండగా, కథానాయకుల పాత్రల్ని రేచీకటి, నత్తి బాధితులుగా చూపించడానికి కారణమేమిటి?
వినోదం మోతాదు పెంచడానికే. ‘ఎఫ్3’కి వచ్చేసరికి అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మామూలు పాత్రకంటే ఇలాంటి పాత్రలతో ఎక్కువగా వినోదం సృష్టించే అవకాశం ఉంటుందనిపించింది. అందుకే ఆ పాత్రల్ని అలా డిజైన్ చేశాం. రాత్రివేళల్లో వచ్చే సన్నివేశాల్లో మాత్రమే వెంకటేష్ అలా రేచీకటితో వినోదం పండిస్తారు. వరుణ్తేజ్ నత్తికి తగ్గట్టుగా మేనరిజమ్ని డిజైన్చేయడం ఓ సవాల్గా అనిపించింది. ముప్పై రకాల మేనరిజమ్స్తో తెరపై కనిపిస్తాడు. జంధ్యాల ‘అహనా పెళ్లంట’ సినిమా ప్రేరణతో వరుణ్ పాత్రని డిజైన్ చేశా.
హాస్య ప్రధానమైన సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. జంధ్యాల, ఈవీవీ స్థానాన్ని భర్తీ చేయాలనేనా?
ప్రస్తుతానికి మన పరిశ్రమలో ఖాళీగా ఉన్న స్థానం అంటే అదే. నేను కూడా మాస్ సినిమాలు చేయాలనే వచ్చా. కామెడీ ఉంటేనే నా సినిమా పరిపూర్ణం అవుతోందనే భావన కలిగింది. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’... ఈ మూడు సినిమాల్లో ఎంత మాస్ వుందో, అంత కామెడీ కూడా పండింది. అయితే ఇంకా విస్తృతమైన పరిధిలో ప్రేక్షకులకు చేరువ కావాలనే ‘ఎఫ్2’ చేశా. ఒక ప్రణాళిక ప్రకారమే చేసిన ఈ సినిమాతో నాకు కామెడీ బ్రాండ్ వచ్చేసింది. దాన్ని సరిచేసుకోవడానికే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో రైలు ఎపిసోడ్ పెట్టాం. ఇప్పుడు ‘ఎఫ్3’తో మళ్లీ కుటుంబ కథ చేశా. తర్వాత బాలకృష్ణ సినిమాతో మళ్లీ మాస్ పంథాలో వెళ్లబోతున్నా. ఇలా ప్రతీ సినిమాకీ వైవిధ్యం ఉండాల్సిందే. ఈ ప్రయాణం నాకూ హాయిగా, ఆరోగ్యంగా ఉంటోంది.
హీరోలు ఇమేజ్ నుంచి బయటికొచ్చి ఇలాంటి పాత్రలు చేయడం అరుదు. మీరు ఈ ఆలోచన చెప్పినప్పుడు వాళ్ల స్పందన ఏమిటి?
కొన్ని సినిమాలు చేయడానికి ఇమేజ్ని దాటి రావాల్సిందే. బాలీవుడ్లో అక్షయ్కుమార్, సల్మాన్ఖాన్లాంటి హీరోలు అదే చేస్తున్నారు. వెంకటేష్ కూడా ఈ సినిమా కోసం పరిమితులేమీ పెట్టుకోకుండా నటించారు. కామెడీ చేసేటప్పుడు అలానే ఉండాలి. ఈ పాత్రల గురించి చెప్పినప్పుడు హీరోలిద్దరూ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమాకి వచ్చేసరికి వాళ్లిద్దరూ మరింత సాన్నిహిత్యంతో కలిసి పనిచేశారు. వాళ్ల నటన ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా