Raviteja: రామారావు రాక ఆలస్యం

రవితేజ కథానాయకుడిగా ప్రశాంత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. దివ్యాంశ కౌశిక్‌, రజీషా విజయన్‌ కథానాయికలు. సుధాకర్‌  చెరుకూరి నిర్మాత. ఈ......

Updated : 27 May 2022 08:09 IST

వితేజ కథానాయకుడిగా ప్రశాంత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. దివ్యాంశ కౌశిక్‌, రజీషా విజయన్‌ కథానాయికలు. సుధాకర్‌  చెరుకూరి నిర్మాత. ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మొదట జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించిన చిత్రవర్గాలు గురువారం కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపాయి. నిర్మాణానంతర పనుల్ని మరింత జాగ్రత్తగా చేయనున్నామని, అందుకే సినిమా విడుదల ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. ఇందులో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని