Adivi Sesh: అది... ఆస్కార్ గెలవడంతో సమానం!
విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న కథానాయకుడు అడివిశేష్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెర కెక్కిన ‘మేజర్’ చిత్రం చేశారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలవుతున్న ఆ సినిమా ప్రచారంలో భాగంగా దేశమంతా పర్యటిస్తున్నారు అడివి శేష్. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు సినిమా’తో ఫోన్లో సంభాషించారు.
విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న కథానాయకుడు అడివిశేష్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెర కెక్కిన ‘మేజర్’ చిత్రం చేశారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలవుతున్న ఆ సినిమా ప్రచారంలో భాగంగా దేశమంతా పర్యటిస్తున్నారు అడివి శేష్. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు సినిమా’తో ఫోన్లో సంభాషించారు.
విడుదలకి ముందే పలుచోట్ల సినిమాని చూపిస్తున్నారు. ఆ నిర్ణయం వెనుక కారణమేంటి?
అమాయకమైన కారణాలతో తీసుకున్న నిర్ణయం అది. తెలుగులో ప్రచారం చేసినట్టుగా, హిందీలోనూ టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొందామని మేం భావించాం. అక్కడ కొన్ని షోలు రద్దయ్యాయి. మా సినిమా విడుదల సమయానికి ఇలాంటి అడ్డంకులు వచ్చాయేమిటి అనిపించింది. మా సినిమా ఎంత బాగుందో మేం షోలల్లో పాల్గొని చెప్పేబదులు, సినిమానే చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. మేజర్ సందీప్ సాహసం స్ఫూర్తితో మేం ధైర్యంగా వేసిన అడుగు అది. భారతీయ సినిమా చరిత్రలో ఓ పెద్ద సినిమాని పది రోజుల ముందే పది నగరాల్లో ప్రదర్శించడం చాలా పెద్ద విషయం. ప్రేక్షకుల నుంచి నా కెరీర్లోనే అత్యుత్తమమైన స్పందనని చూశా.
మేజర్ సందీప్ తల్లి దండ్రులు సినిమాని చూశారా?
వాళ్లు ఇప్పటికే చాలా సన్నివేశాల్ని చూశారు. 31వ తేదీన పూర్తిస్థాయి సినిమాని బెంగళూరులో చూస్తారు. నిర్మాణంలో భాగమైన కథానాయకుడు మహేష్బాబు చూశారు. అందమైన వ్యక్తి నుంచి అంతే అందమైన స్పందన వచ్చింది. ఆయన మెచ్చుకోవడం మాకు ఆస్కార్ గెలవడంతో సమానం.
26/11 నేపథ్యాన్ని ఇదివరకు చాలా మంది స్పృశించారు కదా...?
‘తొలిప్రేమ’ వచ్చిందని ‘ఖుషీ’ చూడకుండా ఉండలేం కదా. మేం చెప్పాలనుకున్నది ఒక అందమైన జీవితం గురించి. అందులో కార్గిల్ యుద్ధం ఉంటుంది, 26 /11 నేపథ్యమూ ఉంటుంది. సందీప్ హైదరాబాద్ కంటోన్మెంట్లో కెప్టెన్. హర్యానాలో ట్రైనింగ్ ఆఫీసర్. సందీప్ తన ఆఖరి 36 గంటల్లో ఎన్ని వందలమంది ప్రాణాలు కాపాడి చనిపోయారో అందరికీ తెలుసు కానీ... దానికి ముందు 31 ఏళ్లు ఎంత అందంగా బతికారనేది ఎవరికీ తెలియదు. సినిమాలో మొదటి 35 నిమిషాలు ‘జానే తు యా జానే నా’, ‘నువ్వే కావాలి’ లాంటి సినిమాలు చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది.
సందీప్ జీవితంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారా?
సందీప్ జీవిత సారాన్ని తీసుకుని చేసిన కథ ఇది. కొన్ని కల్పితాలు ఉండొచ్చు కానీ... ఆ జీవితానికీ, అందులోని భావోద్వేగాలకి న్యాయం చేస్తున్నామా లేదా? అనేది చూసుకునే సినిమా చేశాం. పక్కింటి కుర్రాడు. అమ్మానాన్నతో కలిసి పాయసం తింటూ దాని గురించి మాట్లాడిన కుర్రాడు. స్కూల్కి వెళుతూ, సరదాగా ఆడుకుంటూ, గళ్ఫ్రెండ్తో ముచ్చట్లు చెబుతూ, స్నేహితులతో కలిసి స్కూల్కి బంక్ కొట్టి సినిమాలు, షికార్లు అంటూ తిరిగిన ఆ కుర్రాడు మేజర్ సందీప్ ఎలా అయ్యాడు? కార్గిల్ యుద్ధంలోనూ, తాజ్ లోపల తను తీసుకున్న పెద్ద పెద్ద నిర్ణయాలకి అప్పటిదాకా గడిపిన అతని జీవితం ఎలా ప్రభావితం చేసిందనే విషయాల్ని ఇందులో చూపించాం.
ఈ చిత్రీకరణలో ఎదురైన సవాళ్లేంటి?
అడుగడుగునా సవాళ్లే. చిత్రీకరణ ఊపందుకుంటోంది అనుకునే సమయంలోనే కొవిడ్ భయపెట్టేది. వందకిపైగా రోజులు, 75 లొకేషన్లు, ఎనిమిది భారీ సెట్లు నిర్మించి సినిమా చేశాం. దిల్లీ, హర్యానా, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో చిత్రీకరణ చేశాం. మిలటరీ లొకేషన్లలో చిత్రీకరణ చేయడం అన్నిటికంటే పెద్ద సవాల్. అనుమతులు అంత సులభంగా రావు. చాలా రోజుల తర్వాత పూర్తిగా మన హైదరాబాద్లో తయారైన భారతీయ సినిమా ఇది.
ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుని సాధించనున్నారు. ఆ విషయంపై మీ అభిప్రాయం?
ఆల్ ఇండియన్ మనిషి సందీప్ గురించి సినిమా చేశాననేది నా భావన. అంతకంటే వేరే ఆశలు పెట్టుకుని నేను చేయలేదు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది? చూశాక ప్రేక్షకులు ఏమనుకుంటారనే సందేహం ఏ రోజూ కలగలేదు. మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడంతోపాటు, కచ్చితంగా నా కెరీర్పై పలు రకాలుగా ప్రభావం చూపిస్తుందనైతే నమ్ముతాను.
కెరీర్పై మీ అమ్మానాన్నలు ఏమంటున్నారు?
‘క్షణం’ సినిమాతోనే నేను నటుడిగా స్థిరపడిపోయాననే భావన వాళ్లలో కలిగింది. ఏదైనా సినిమా ఆలోచన పంచుకోవడానికి సిద్ధమైతే ‘నువ్వు సినిమా తీస్తున్నావంటే అది బాగుంటుందిరా. చెప్పాల్సిన అవసరమే లేదు’ అంటుంటారు మా నాన్న. నాకు దక్కిన ఓ గొప్ప ప్రశంస అది. ప్రేక్షకులు నాపై ప్రదర్శిస్తున్న నమ్మకం గుర్తొస్తే తృప్తి కలుగుతుంది.
కొత్త సినిమాల కబుర్లేమిటి?
నాని నిర్మాణంలో రూపొందుతున్న ‘హిట్ 2’ సినిమా ఉంది. మార్వెల్ ప్రపంచంలాగా దాన్ని మరింత పెద్దగా చేద్దామని నన్ను ఆ ప్రాజెక్ట్లోకి రమ్మన్నారు. ఒకొక్క పోలీస్ అధికారి కథ ఒకొక్క నగరంలో జరుగుతుంటుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. తదుపరి ‘గూఢచారి2’ చేయాలి. స్క్రిప్ట్ రాయడంపై దృష్టిపెట్టా. కథకి అవకాశం ఉందన్నప్పుడు కచ్చితంగా నా సినిమాల్ని పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యంగానే రూపొందిస్తాం.
రచన పరంగా ప్రభావం చూపిస్తున్నారు. దర్శకత్వంపై దృష్టి పెడదామనే ఆలోచనలు వస్తుంటాయా?
నేనొక విజయవంతమైన నటుడిని, మంచి రచయితని, దర్శకుడిగా పరాజితుడిని. ఆ మాట చాలా నమ్మకంగా చెబుతాను. అయితే నేను రచయితని కావడం నా కెరీర్కి చాలా మేలైంది. కథల కోసం ఎవరి దగ్గరికో వెళ్లాల్సిన అవసరం ఉండదు. మంచి కథలు మన దగ్గరే ఉన్నాయని తెలుసు కాబట్టి! ఈ సినిమా విషయంలో దర్శకుడు శశికిరణ్ తిక్క పడిన కష్టం చాలా ఎక్కువ. తను సితార సంస్థలో సినిమా చేస్తుంటే, ఒక్క ఏడాది అని చెప్పి తీసుకొచ్చా. తీరా మూడేళ్లయింది. నా కెరీర్ని మరోస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు తను. సందీప్లాంటి ఓ గొప్ప మనిషి జీవితంలో ఎన్నో గొప్ప విషయాలున్నాయి. వాటిలో ఏది చూపించాలనే విషయంపై శశికిరణ్ అద్భుతమైన పనితీరుని ప్రదర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం